AP News: అంబులెన్స్‌లో పేషెంట్‌ను తీసుకొచ్చిన కుటుంబసభ్యులు

Ongoing AP CM Jagan Bus Yatra
x

AP News: అంబులెన్స్‌లో పేషెంట్‌ను తీసుకొచ్చిన కుటుంబసభ్యులు

Highlights

AP News: అవసరమైన సహాయం అందిస్తామని సీఎం జగన్ హామీ

AP News: ఏపీ సీఎం జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సుయాత్రలో తన ఔదార్యాన్ని చాటుకున్నారు. బస్సు యాత్ర నిర్వహిస్తున్న సమయంలో మడికి గ్రామంలో అంబులెన్స్‌లో ఓ పేషెంట్‌ను తన కుటుంబసభ్యులు తీసుకొచ్చారు. అంబులెన్స్‌ను గమనించిన సీఎం జగన్ బస్సు నుంచి దిగి అంబులెన్స్ వద్దకు వెళ్లారు. సీఎం స్వయంగా వె‌ళ్లి పేషెంట్ కుటుంబసభ్యులతో మాట్లాడారు. ఓ ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న వ్యక్తికి మరింత సహాయం కావాలని బాధితులు సీఎం జగన్‌ను వేడుకున్నారు. దీంతో రోగికి అవసరమైన సహాయం అందిస్తామని కుటుంబసభ్యులకు హామీ ఇచ్చారు సీఎం జగన్.‎

Show Full Article
Print Article
Next Story
More Stories