భార్య, కుమార్తెను కాపాడుకునేందుకు.. చిరుతపులితో పోరాడి చంపేసిన..

Arun Chilukuri
Updated on: 23 Feb 2021 2:51 PM IST
భార్య, కుమార్తెను కాపాడుకునేందుకు.. చిరుతపులితో పోరాడి చంపేసిన..
X

భార్య, కుమార్తెను కాపాడుకునేందుకు.. చిరుతపులితో పోరాడి చంపేసిన..

కర్ణాటకలో ఓ వ్యక్తి తన కుటుంబ సభ్యులను కాపాడుకునేందుకు చిరుతపులితో వీరోచితంగా పోరాడి దాన్ని అంతమొందించాడు. కర్ణాటకలోని హసన్ జిల్లా బెండాకెరె ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. రాజగోపాల్ నాయక్ అనే వ్యక్తి తన భార్య, కుమార్తెతో కలిసి బైక్ పై వెళుతుండగా, అటవీప్రాంతంలో ఓ చిరుతపులి దాడి చేసింది. చిరుత ధాటికి బైక్ అదుపుతప్పి కిందపడిపోయింది.

ఈ క్రమంలో ఆ చిరుత తన భార్య, కుమార్తెలను గాయపర్చడం చూసిన రాజగోపాల్ నాయక్ ప్రాణాలకు తెగించి ఆ చిరుతతో పోరాడాడు. తనకు గాయాలు అయినప్పటికీ భయపడకుండా ఆ చిరుతపులిని చంపేశాడు. చిరుత దాడిలో గాయపడిన రాజగోపాల్ తో పాటు అతడి భార్య, కుమార్తెలను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఎవరికీ ప్రాణాపాయం లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.