PM Modi: కోవిడ్ యోధులకు ప్రత్యేక శిక్షణ కోర్సు

PM Modi Launches Training Programe For Frontline Workers
x

ప్రధాని మోడీ (ఫైల్ ఇమేజ్)

Highlights

PM Modi: వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించిన ప్రధాని మోడీ

PM Modi: కోవిడ్ యోధులకు ప్రత్యేక శిక్షణ కోర్సును ప్రధాని మోడీ ప్రారంభించారు. దేశవ్యాప్తంగా లక్ష మంది కోవిడ్‌ యోధులను తయారుచేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఆయన ప్రారంభించారు. కోవిడ్-19 ఫ్రంట్‌లైన్ వర్కర్ల నైపుణ్యాన్ని పెంచేందుకు ఈ కోర్సు ఉపయోగపడుతుంది. కరోనా వైరస్ తన రూపాన్ని నిరంతరం మార్చుకుంటూ...దేశానికి సవాలు విసురుతోందని ప్రధాని అన్నారు. ఈ వైరస్‌తో పోరాడేందుకు మరింత ఎక్కువగా సిద్ధం కావాలని చెప్పారాయన. ఈ లక్ష్యంతోనే ఫ్రంట్‌లైన్ వర్కర్లకు దేశవ్యాప్తంగా శిక్షణ కార్యక్రమాలను ప్రారంభించినట్లు మోడీ తెలిపారు.


Show Full Article
Print Article
Next Story
More Stories