IPL 2021: సన్‌రైజర్స్‌పై 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించిన ఢిల్లీ

Delhi Capitals won by the 8 wickets on Sunraisers
x
ఢిల్లీ క్యాపిటల్స్ ఘాన విజయం (ఫైల్ ఇమేజ్)
Highlights

IPL 2021: దుబాయ్‌ వేదికగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ 8 వికెట్ల తేడాతో ఘనవిజయం

IPL 2021: దుబాయ్‌ వేదికగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఎస్‌ఆర్‌హెచ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 134 పరుగులకే పరిమితమైంది. ఢిల్లీ బౌలర్లో రబడా 3 వికెట్లు పడగొట్టగా, నోర్ట్జే,అక్షర్‌ పటేల్‌ చెరో రెండు వికెట్లు సాధించారు. ఆనంతరం 135 పరుగుల స్వల్ప లక్ష్య చేధనతో బరిలోకి దిగిన ఢిల్లీ ఆదిలోనే ఓపెనర్‌ పృథ్వీషా(11) వికెట్‌ కోల్పోయింది.

ఆ తర్వాత మరో ఓపెనర్‌ శిఖర్ ధావన్, శ్రేయాస్ అయ్యర్ కలిసి రెండో వికెట్‌కి 52 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.. 37 బంతుల్లో 6 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 42 పరుగులు శిఖర్ ధావన్ రషీద్ ఖాన్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రిషబ్ పంత్, శ్రేయాస్‌తో కలిసి లక్ష్యాన్ని సూనాయసంగా చేధించారు. పంత్ (35) పరుగులు చేయగా, శ్రేయాస్ అయ్యర్ ( 47) పరుగులు చేశాడు. ఈ విజయంతో ఢిల్లీ క్యాపిటల్స్‌ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది.


Show Full Article
Print Article
Next Story
More Stories