Motera Stadium: మొతెరా ఓ అద్భుతం..క్రికెట‌ర్లు ఫిదా

Motera Stadium: మొతెరా ఓ అద్భుతం..క్రికెట‌ర్లు ఫిదా
x
Highlights

Motera Stadium: భారత్, ఇంగ్లండ్ టెస్టు మ్యాచ్‌కు సిద్ధమైన మొతెరా మైదానం. ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియంగా గుర్తింపు.

Motera Stadium: భారత్, ఇంగ్లండ్‌ మధ్య బుధవారం నుంచి జరిగే మూడో టెస్టు మ్యాచ్‌ కు ఓ ప్రత్యేకత ఉంది. ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియంగా గుర్తింపు పొందిన మొతెరా మైదానం.. తొలి అంతర్జాతీయ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇవ్వబోతోంది. 'సర్దార్‌ పటేల్‌ స్టేడియం'గా కూడా పిలిచే మొతెరా లో 1983 నవంబర్‌లో ఫస్ట్ ఇంటర్నేషనల్ మ్యాచ్‌ జరిగింది. సునీల్‌ గావస్కర్‌ 10 వేల పరుగుల మైలురాయిని దాటడం, రిచర్డ్‌ హ్యాడ్లీ రికార్డును అధిగమిస్తూ కపిల్‌దేవ్‌ తన 432వ వికెట్‌ను పడగొట్టడం వంటి చిరస్మరణీయ ఘట్టాలకు ఈ మైదానం వేదికైంది.


అనంతరం 2006 చాంపియన్స్‌ ట్రోఫీ సమయంలో పలు మార్పులతో ఈ స్టేడియాన్ని ఆధునీకరించారు. ఆతర్వాత 2011 ప్రపంచకప్‌లో భారత్, ఆస్ట్రేలియా మధ్య క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్ జరిగింది. ఈ గ్రౌండ్‌లో ఆఖరి అంతర్జాతీయ మ్యాచ్‌ 2012 డిసెంబర్‌లో జరిగింది. అనంతరం 2015 అక్టోబర్‌లో గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ అప్పటి జీసీఏ అధ్యక్షుడు, ప్రస్తుత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ నాయకత్వంలో స్టేడియాన్ని కూలగొట్టి.. ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంగా మార్చాలని నిర్ణయించారు.


2017 జనవరిలో నిర్మాణం ప్రారంభమైన అనంతరం సరిగ్గా మూడేళ్ల తర్వాత స్టేడియం సిద్ధమైంది. గతేడాది 'నమస్తే ట్రంప్‌' ప్రోగ్రాం ఇక్కడే జరిగింది. ఇటీవల ముస్తాక్‌ అలీ ట్రోఫీ నాకౌట్‌ మ్యాచ్‌లతో తొలిసారి క్రికెట్‌ పోటీలకు గ్రౌండ్‌ ఆతిథ్యమిచ్చింది. ప్రస్తుతం తొలిసారి టెస్టు మ్యాచ్‌ కోసం సిద్ధమైంది. పైగా ఈ టెస్టు మ్యాచ్‌ పింక్‌ బాల్ తో జరిగే డే అండ్‌ నైట్‌ టెస్టు కావడంతో మైదానం మరింత కాంతివంతంగా మెరవబోతోంది.


మొతేరా స్టేడియం విశేషాలు

  1. సబర్మతి నది ఒడ్డున స్టేడియం కోసం 100 ఎకరాలను 1982లో గుజరాత్ ప్రభుత్వం కేటాయించింది.
  2. ఆస్ట్రేలియాకు చెందిన పాపులస్‌ సంస్థ 49,000 సామర్థ్యమున్న పాత స్టేడియాన్ని కూలగొట్టి సుమారు రూ.678 కోట్లతో
    1 లక్షా 10
    వేల సీటింగ్ తో కేవలం 9 నెలల్లోనే పునర్నిర్మించింది.
  3. ప్రస్తుతం మైదానంలో 11 పిచ్‌లు ఉన్నాయి. ఎరుపు, నలుపు మట్టితో వికెట్లను సిద్ధం చేశారు. మైదానంలోని ఆస్ట్రేలియా నుంచి తెప్పించిన బెర్ముడా గడ్డిని వాడారు.
  4. పిల్లర్లు లేకుండా స్టేడియాన్ని నిర్మించడం మరో అద్భుతం. ప్రేక్షకులు స్టేడియంలోని ఏ మూల కూర్చున్న ఎలాంటి ఇబ్బంది లేకుండా మ్యాచ్‌ను తిలకించొచ్చు.
  5. 55 గదులు, ఇండోర్‌.. ఔట్‌డోర్‌ క్రీడలు, రెస్టారెంట్లు, ఒలింపిక్‌ ప్రమాణాలతో స్విమ్మింగ్‌పూల్, జిమ్నాజియం, పార్టీ ఏరియా,
    3డి
    థియేటర్‌లతో క్లబ్‌హౌస్‌ను ఈ స్టేడియంలో నిర్మించారు. క్రికెట్‌ అకాడమీ, ఇండోర్‌ ప్రాక్టీస్‌ పిచ్‌లూ స్టేడియంలో భాగమే.
  6. ఈ స్టేడియంలో అదనంగా రెండు క్రికెట్‌ మైదానాల్లో 9 ప్రాక్టీస్‌ పిచ్‌ల్ని రూపొందించారు. ఫుట్‌బాల్, హాకీ, బాస్కెట్‌బాల్, కబడ్డీ, బాక్సింగ్, టెన్నిస్ లాంటి గేమ్స్ కి కావలసిన అన్ని మౌలిక వసతులు ఏర్పాటు చేశారు.
  7. 8 సెంటీ మీటర్ల వర్షం కురిసినా..వెంటనే మ్యాచ్ ప్రారంభించేలా అధునాతన డ్రేనేజీ సిస్టంను రూపొందించారు. ఈ స్టేడియంలో
    3 వేల కార్లు
    , 10 వేల టూ వీలర్ వాహనాలకు పార్కింగ్ సదుపాయం ఉంది.
  8. దేశంలో ఎల్‌ఈడీ కాంతులు వెదజల్లనున్న మొట్టమొదటి స్టేడియం ఇదే. ఫ్లడ్‌లైట్లకు బదులు స్టేడియం పైకప్పునకే ఎల్‌ఈడీ లైట్లు అమర్చారు. అయితే స్టేడియంలో ఆటగాళ్ల నీడ కూడా పడే అవకాశం లేకపోవడం మరో విశేషం.
Show Full Article
Print Article
Next Story
More Stories