Telangana: మాజీ మంత్రి షబ్బీర్‌ అలీకి చేదు అనుభవం.. మంత్రికి ఫోన్ చేసినా..

Declare Health Emergency in Telangana: Shabbir Ali
x

Telangana: మాజీ మంత్రి షబ్బీర్‌ అలీకి చేదు అనుభవం.. మంత్రికి ఫోన్ చేసినా.. 

Highlights

Telangana: మాజీ మంత్రి షబ్బీర్‌ అలీకి చేదు అనుభవం ఎదురైంది. తన బంధువుకు ఒక్క కరోనా బెడ్‌ కూడా ఇప్పించలేకపోయారు.

Telangana: మాజీ మంత్రి షబ్బీర్‌ అలీకి చేదు అనుభవం ఎదురైంది. తన బంధువుకు ఒక్క కరోనా బెడ్‌ కూడా ఇప్పించలేకపోయారు. హెల్త్‌మినిస్టర్‌కు ఫోన్ చేసినా, అధికారులను కలిసినా ప్రయోజనం లేదు. ఉదయం నుంచి వైద్యాధికారును సంప్రదించినా మొండిచేయి చూపించారు. హైదరాబాద్‌లోని బడా బడా కార్పోరేట్‌ ఆసుపత్రుల్లో ఆరా తీసిన సింగిల్‌ బెడ్‌ దొరకలేదు. రాష్ట్రంలో పరిస్థితి ఇలా ఉందా అని ఆయన నిర్ఘాంతపోయారు. తనకే ఇలా జరిగితే ఇక పేదలకు కరోనా వస్తే వాళ్ల పరిస్థితి ఎంటని షబ్బీర్‌ అలీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

తెలంగాణలో కరోనా కోరలు చాస్తోంది. కరోనా మరణాలు బెంబెలెత్తిస్తున్నాయి. ఇలాంటి సమయంలో కోవిడ్ పేషెంట్లకు రాష్ట్రంలో ఎక్కడా బెడ్స్ లేవని మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఆరోపిస్తున్నారు. అయినా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించాని ఆయన డిమాండ్ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories