Telangana: దెయ్యం భయంతో ఏకంగా గ్రామాన్నే ఖాళీ చేసిన వైనం

People Leaving from Village Over Ghost Fear in Potharam
x

Ghost Fear in Potharam

Highlights

Telangana: గ్రామాన్ని వదిలి వెళ్లిన 40 కుటుంబాలు * జనగామ జిల్లా తరిగొప్పుల మండలం పోతారంలో ఘటన

Telangana: భయం అవును ఈ ఒక్క పదం మనిషిని ఏదైనా చేస్తుంది. జనగామ జిల్లా తరిగొప్పుల మండలం పోతారం గ్రామస్థులను ఈ దెయ్యం భయమే కంటిమీద కునుకు లేకుండా చేసింది. అంతెందుకు ఏకంగా ఊరు ఊరునే ఖాళీ చేయించింది. వినడానికి విచిత్రంగా ఉన్నా ఇప్పుడు పోతారం గ్రామాన్ని చూస్తే నిజమని నమ్మక తప్పదు. అయితే.. ఆ గ్రామంలో నిజంగానే దెయ్యం ఉందా? లేదంటే ఈ పుకార్ల వెనుక ఉన్న అసలు నిజం ఏంటి?

గత కొద్ది రోజులుగా పోతారం గ్రామంలో దెయ్యం తిరుగుతోందన్న భయం ప్రజలను కంటి మీద కునుకు లేకుండా చేసింది. అంతేకాదు ఈ దెయ్యం ఏకంగా గ్రామంలోని యువకులపై అత్యాచారం చేస్తోందనే వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. దీంతో ఏకంగా నాలబైకి పైగా కుటుంబాలు ఇండ్లకు తాళం వేసి మండల కేంద్రానికి మకాం మార్చారు.

అయితే.. ఈ దెయ్యం పుకార్ల వెనుక ఓ విస్తుగొలిపే నిజం ఉందన్న ఊహాగానాలు ఉన్నాయి. కేవలం రియల్ ఎస్టేట్ కోణం ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే ఓ మూఢనమ్మకాన్ని గ్రామంలోకి వదిలేశారంటూ ప్రచారం జరుగుతోంది. ఈ మొత్తం వ్యవహారంలో పోలీసులు గ్రామంలో ఏం జరిగిందో తెలుసుకునేందుకు ప్రయత్నిలు మొదలుపెట్టారు. అటు.. పోతారం సర్పంచ్ సైతం దెయ్యం వార్తలను కొట్టిపడేశారు.

మరోవైపు ఈ కాలంలోనూ మూఢనమ్మకాలతో ఏకంగా గ్రామాన్ని ఖాళీ చేయడం పట్ల జనవిజ్ఞాన వేదిక దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది. మూఢనమ్మకాల పట్ల ఒక్క పోతారం గ్రామాన్నే కాదు.. అందరిలోనూ అవగాహన తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories