రఘురామ అరెస్ట్..'రూల్ ఆఫ్ లా'ను నిర్వీర్యం చేస్తున్నారు: అచ్చెన్నాయుడు

Atchimnaidu
x

అచ్చనాయుడు ఫైల్ ఫోటో 

Highlights

Atchannaidu: వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణరాజును అరెస్ట్ చేయడంపై అచ్చెన్నాయుడు స్పందించారు.

Atchannaidu: వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణరాజును ఏపీసీఐడీ అరెస్ట్ చేయడంపై రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పందించారు. రాష్ట్రంలో నమోదు అవుతున్న కరోనా కేసుల కన్నా ప్రతిపక్ష పార్టీల నేతలపై పెడుతున్న అక్రమ కేసులే ఎక్కువగా ఉంటున్నాయి. ఫిర్యాదు ఇవ్వడానికి గుంటూరులో ఒక పోలీస్‌స్టేషన్‌కు వెళ్ళిన టీడీపీ నేతలపై కరోనా నిబంధనలు ఉల్లంఘించారని కేసు నమోదు చేయడం దారుణం. వైసీపీ నేతలు చెప్పినట్లు ఆడుతూ టీడీపీ నేతలపై తప్పుడు కేసులు పెడుతున్న పోలీసులు మున్ముందు వాటికి మూల్యం చెల్లించుకోక తప్పదు'' అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు హెచ్చరించారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన చేశారు. జగన్ పాలన ఎమర్జెన్సీ రోజులను తలపిస్తోందని అన్నారు. రఘురామకృష్ణరాజు లేవనెత్తిన అంశాలపై సమాధానం చెప్పలేకనే అక్రమ అరెస్టుకు పూనుకున్నారని విమర్శించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories