వేణుమాధవ్‌కు 20 కోట్ల ఆస్తి ఉంది.. నా కొడుకు మరణానికి కారణం అదే.. సంచలన విషయాలు చెప్పిన తల్లి..

Comedian Venu Madhavs Mother Emotional Words
x

వేణుమాధవ్‌కు 20 కోట్ల ఆస్తి ఉంది.. నా కొడుకు మరణానికి కారణం అదే.. సంచలన విషయాలు చెప్పిన తల్లి..

Highlights

Venu Madhav: టాలీవుడ్ ఎప్పటికీ గుర్తుంచుకునే కమెడియన్లలో వేణుమాధవ్ పేరు కూడా ఉంటుంది.

Venu Madhav: టాలీవుడ్ ఎప్పటికీ గుర్తుంచుకునే కమెడియన్లలో వేణుమాధవ్ పేరు కూడా ఉంటుంది. ఎన్నో సినిమాలలో తన పర్ఫామెన్స్ తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన వేణుమాధవ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. మిమిక్రీ ఆర్టిస్ట్ గా తన కెరీర్ ను మొదలుపెట్టిన వేణుమాధవ్ చాలా తక్కువ సమయంలోనే స్టార్ కమెడియన్గా ఎదిగారు. కానీ 2019లో ఆయన అనారోగ్యంతో కన్నుమూశారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వేణుమాధవ్ తల్లి సావిత్రమ్మ కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.

వేణుమాధవ్ చనిపోయే సమయానికి ఆయనకు 20 కోట్లకు పైగానే ఆస్తులు ఉన్నాయని అయినా కూడా తాను అద్దె ఇంట్లోనే ఉంటున్నానని అన్నారు సావిత్రమ్మ. "నా ముగ్గురు కొడుకులలో వేణుమాధవ్ చిన్నవాడు. చిన్నప్పటి నుంచి చాలా చురుకుగా ఉండేవాడు. మిమిక్రీ చేసేవాడు. ఆ తర్వాత మంచి నటుడిగా కూడా ఎదిగాడు. తనని చూసి నేను గర్వపడేదాన్ని. నా ఇద్దరు కొడుకులను తనకు అసిస్టెంట్లుగా పెట్టాను. కానీ ఎందుకు అలా చేశానని ఇప్పటికీ బాధపడుతూ ఉంటాను.

వేణుమాధవ్ బాగానే ఎదిగాడు కానీ వాళ్ళిద్దరూ మాత్రం ఎదగలేకపోయారు. వేణు ఉండి ఉంటే వాళ్ళను చూసుకునేవాడేమో. కానీ తన చేతులతో తన ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నాడు. ఏ జబ్బు చేసినా తనకు టాబ్లెట్లు వేసుకునే అలవాటు లేదు. జాండీస్, డెంగ్యూ, వచ్చినా కూడా మందులను నిర్లక్ష్యం చేసేవాడు. దాంతో తన పరిస్థితి విషమించి చనిపోయాడు. వేణు చనిపోవడానికి నెలరోజుల ముందే నా పెద్ద కొడుకు కూడా చనిపోయాడు. ఇద్దరు కొడుకులు మరణం తో నేను కృంగిపోయాను," అంటూ ఆమె కన్నీటి పర్యంతం అయ్యారు. వేణుకి ఇద్దరు కొడుకులు ఉన్నారని వాళ్లు స్వంత ఇంట్లో ఉంటున్నారు కానీ తను మాత్రం తన మూడో కొడుకుని చూసుకుంటూ అద్దె ఇంట్లోనే ఉంటున్నానని చెప్పుకొచ్చారు సావిత్రమ్మ.

Show Full Article
Print Article
Next Story
More Stories