Karnataka shocker: ఇద్దరు పిల్లలను గొంతు నులిమి.. హ*త్య చేసి.. ఉ*రివేసుకుని.. కర్ణాటకలో భయంకర ఘటన

Karnataka shocker
x

Karnataka shocker: ఇద్దరు పిల్లలను గొంతు నులిమి.. హ*త్య చేసి.. ఉ*రివేసుకుని.. కర్ణాటకలో భయంకర ఘటన

Highlights

Karnataka shocker: పోలీసుల దృష్టికి వచ్చిన ఉడయ్ సూసైడ్ నోట్‌లో, అతను తన భార్యను ఎంతగానో ప్రేమించానని, ఆమెతో కలిసేందుకు తన పిల్లలతో కలిసి వెళ్లిపోతున్నానని వ్రాసి ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు.

Karnataka shocker: కర్ణాటకలో ఓ దారుణ ఘటన చోటుచేసుకుంది. గత సంవత్సరం భార్య మరణించిన విషాదాన్ని తట్టుకోలేక ఓ వ్యక్తి తన ఇద్దరు పిల్లలను హత్య చేసి, తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బెంగళూరులోని గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ విషాద సంఘటన గురువారం జరిగింది. 32 ఏళ్ల ఉదయ్ అనే వ్యక్తి గతంలో ప్రేమించి పెళ్లి చేసుకున్న తన భార్యను గత ఏడాది సెప్టెంబర్‌లో గుండెపోటుతో కోల్పోయాడు. ఆ తరువాత అతను తీవ్ర మనోవేదనలో కూరుకుపోయాడు. భార్య కోలాహలంతో ఉన్న కుటుంబం ఒక్కసారిగా ఖాళీ అయిపోవడం, ఇద్దరు చిన్నారులను ఒంటరిగా పెంచాల్సిన బాధ్యతలు అతనిపై భారీగా ఒత్తిడిని తీసుకొచ్చినట్టు పోలీసులు తెలిపారు.

ఇంతకముందు కూడా ఉదయ్ ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నప్పటికీ, పిల్లల గురించి ఆలోచించి ఆ ఆలోచనను వదిలేశాడు. కానీ గురువారం రోజు అతను తన నాలుగు సంవత్సరాల కుమార్తె, మూడు సంవత్సరాల కుమారుడిని గొంతు నులిమి హత్య చేసి, తాను ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

పోలీసుల దృష్టికి వచ్చిన ఉడయ్ సూసైడ్ నోట్‌లో, అతను తన భార్యను ఎంతగానో ప్రేమించానని, ఆమెతో కలిసేందుకు తన పిల్లలతో కలిసి వెళ్లిపోతున్నానని వ్రాసి ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories