మధుర్ మహాగణపతి ఆలయం (కేరళ)
మొగ్రాల్ నది ఒడ్డున ఉన్న ఈ ఆలయం ప్రధానంగా శివాలయమైనప్పటికీ, గర్భగుడిలో గణపతికి అగ్రతాంబూలం ఉంటుంది. ఒకప్పుడు కేవలం చిత్రపటంగా ఉన్న విగ్రహం పరిమాణంలో పెరిగి 'బొడ్డ గణేష'గా మారింది. టిప్పు సుల్తాన్ దాడి చేయాలనుకుని, ఇక్కడి బావి నీరు తాగి మనసు మార్చుకుని దాడిని విరమించుకున్నాడని చెప్తారు.