రాత్రి భోజనం తర్వాత ఈ 3 పనులు చేస్తే బొడ్డు కొవ్వు కరిగిపోవడం ఖాయం

బిజీ లైఫ్ స్టైల్ వల్ల ఆరోగ్యంపై శ్రద్ద తీసుకోవడం లేదు. దీంతో మన అలవాట్లను మార్చుకోవాల్సి వస్తుంది. కొన్ని మార్పులు చేయడం వల్ల ఫిట్ గా, ఆరోగ్యంగా ఉండవచ్చు.
రాత్రి భోజనం తర్వాత కేవలం 20 నిమిషాల పాటు ఇలా చేస్తే ఆరోగ్యంగా, ఫిట్ గా ఉంటారు.
గోరువెచ్చని నీళ్లు తాగాలి:
రాత్రి భోజనం తిన్న 30 నిమిషాల తర్వాత ఒక గ్లాసు గోరువెచ్చని నీరు తాగాలి. ఇలా చేస్తే జీవక్రియ వేగవంతం అవుతుంది. ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది.
రాత్రి మొబైల్ చూడకండి
భోజనం చేసిన తర్వాత చాలా మంది మొబైల్ చూస్తారు. ఈ అలవాటు మంచిది కాదు. నిద్రలేమికి కారణం అవుతుంది. తక్కువ నిద్ర వల్ల బరువు పెరుగుతారు.
రాత్రి త్వరగా భోజనం చేయడం
చాలా మంది రాత్రి ఆలస్యంగా భోజనం చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల శరీరంలో కొవ్వు వేగంగా పెరుగుతుంది. రాత్రి 7 నుంచి 8గంటల లోపు భోజనం పూర్తి చేయండి.
భోజనం తర్వాత నడక
భోజనం చేసిన వెంటనే పడుకోకుండా కాసేపు వాకింగ్ చేయండి. ఇలా చేయడం వల్ల ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది.
యోగా చేయండి
మీరు వాకింగ్ చేయడం కుదరకపోతే సాధారణ స్ట్రెచింగ్ లేదా యోగా చేయడం ద్వారా కూడా కొవ్వును కరిగించుకోవచ్చు.