ఉదయం ఖాళీ కడుపుతో ఇవి తింటే షుగర్ నార్మల్ అవ్వడం ఖాయం

డయాబెటిక్ రోగులు ఉదయం సరైన అల్పాహారం తీసుకుంటే రక్తంలో షుగర్ అదుపులో ఉంటుంది. ఖాళీ కడుపుతో పానీయాలు, ఆహారాలు తీసుకుంటే ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది. రోజంతా శక్తి లభిస్తుంది.
రక్తంలో షుగర్ కంట్రోలో ఉండాలంటే ఖాళీ కడుపుతో ఈ 5 పదార్ధాలు తినాలి. అవేంటో చూద్దాం.
మెంతుల నీరు
ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో మెంతుల నీరు తాగడం వల్ల రక్తంలో షుగర్ లెవల్స్ ఫైబర్, యాంటీఆక్సిడెంట్లను కంట్రోల్ చేయడంలో సహాయపడుతుంది.
చియా విత్తనాలు
చియా విత్తనాలను రాత్రంతా స్మూతీలో నానబెట్టి తినడం లేదా ఓట్స్ లో కలుపుకుని తింటే ఫైబర్ సమతుల్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇందులోని ఒమేగా 3 గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
కాకరకాయ, దోసకాయ
ఖాళీ కడుపుతో కాకరకాయ, దోసకాయ, టమోటా జ్యూస్ తాగడం వల్ల రక్తంలో వేగంగా నియంత్రణ ఉంటుంది. విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి.
కలబంద జ్యూస్
ప్రతిరోజూ ఉదయం ఇంట్లో తయారు చేసిన కలబంద జ్యూస్ తాగడం వల్ల బ్లడ్ షుగర్ అదుపులో ఉంటుంది. దీనిలోని యాంటీ ఆక్సిడెంట్లు చక్కెరను కంట్రోల్లో ఉంచుతాయి.
డ్రై ఫ్రూట్స్
నానబెట్టిన బాదం, వాల్నట్స్ లో ఉండే ప్రొటీన్, ఫైబర్ షుగర్ ను కంట్రోల్ చేస్తాయి. ఎండుద్రాక్ష, అంజూర, ఖర్జూరాలను తక్కువ తినాలి.
హైడ్రేట్ గా ఉండటం
తగినంత నీరు తాగడం మర్చిపోవద్దు. నీరు రక్తంలోని షుగర్ ను కంట్రోల్లో ఉంచుతుంది. టాక్సిన్స్ ను బయటకు పంపిస్తుంది. రోజుకు కనీసం 2 నుంచి 3 లీటర్ల నీరు తాగాలి.
క్రమం తప్పకుండా వ్యాయామం
అల్పాహారం తర్వాత తేలికపాటి నడక గ్లూకోజ్ వినియోగాన్ని పెంచుతుంది. ప్రతిరోజూ 20 నుంచి 30 నిమిషాల వ్యాయామం చేయాలి.