
IPL 2026 : రూ.18 కోట్ల సంజు శాంసన్ కోసం.. జడేజా, శాం కరణ్లను వదులుకుంటున్న సీఎస్కే
ఐపీఎల్ అభిమానులకు సంచలనం కలిగించే వార్త ఒకటి ట్రేడ్ విండో నుంచి వెలువడింది. చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య ప్లేయర్ల మార్పిడి డీల్ తుది దశకు చేరుకుంది.
IPL 2026 : ఐపీఎల్ అభిమానులకు సంచలనం కలిగించే వార్త ఒకటి ట్రేడ్ విండో నుంచి వెలువడింది. చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య ప్లేయర్ల మార్పిడి డీల్ తుది దశకు చేరుకుంది. ఈ డీల్లో భాగంగా రాజస్థాన్ కెప్టెన్ సంజు శాంసన్ సీఎస్కే లోకి రానుండగా, సీఎస్కే నుంచి స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా, ఇంగ్లీష్ ఆల్రౌండర్ శాం కరణ్ రాజస్థాన్ రాయల్స్కు వెళ్లబోతున్నారు. క్రికబజ్ రిపోర్ట్ ప్రకారం.. ఈ ముగ్గురు ఆటగాళ్లు డీల్కు తమ అంగీకారం తెలియజేస్తూ సంతకాలు కూడా చేశారు. అయితే, అధికారిక ప్రకటన వెలువడటానికి ఇంకా కొన్ని సాంకేతిక ప్రక్రియలు పూర్తి కావాల్సి ఉంది.
ఐపీఎల్ 2026 మెగా ఆక్షన్ ముందు జరగనున్న ఈ అత్యంత సంచలనాత్మకమైన ట్రేడ్ డీల్కు సంబంధించిన కీలక అడుగు పూర్తైంది. రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ ను చెన్నై సూపర్ కింగ్స్ తీసుకుంటుండగా, సీఎస్కే నుంచి రవీంద్ర జడేజా, శాం కరణ్ రాజస్థాన్ రాయల్స్కు వెళ్లడానికి సిద్ధమయ్యారు.
క్రిక్ బజ్ నివేదికల ప్రకారం..ఈ ముగ్గురు ఆటగాళ్లు ట్రేడ్కు తమ పూర్తి సమ్మతిని తెలుపుతూ సంతకాలు కూడా చేశారు. అయితే, ఈ ప్రక్రియ పూర్తి కావడానికి ఇంకా కొన్ని రోజులు పట్టే అవకాశం ఉంది. ట్రేడ్ డీల్ అధికారికంగా ప్రకటించబడాలంటే భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ఇందులో జోక్యం చేసుకోవడం తప్పనిసరి. ట్రేడ్కు సంబంధించి రాజస్థాన్ లేదా చెన్నై ఫ్రాంఛైజీలు సోమవారం సాయంత్రం వరకు ఐపీఎల్ లేదా బీసీసీఐ అధికారులకు అధికారిక సమాచారం ఇవ్వలేదు. ఈ సమాచారం అందిన తర్వాతే డీల్ అధికారికంగా పూర్తవుతుంది.
ఐపీఎల్ నిబంధనల ప్రకారం, విదేశీ ఆటగాడిని (ఓవర్సీస్ ప్లేయర్) ట్రేడ్ చేసేటప్పుడు నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ అవసరం. శాం కరణ్ ఇంగ్లాండ్కు చెందిన ఆటగాడు కాబట్టి, ఆయన ట్రేడ్ డీల్ పూర్తి కావడానికి ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు ప్రమేయం అవసరమవుతుంది. ఈ ట్రేడ్ డీల్లో ఉన్న ముగ్గురు ఆటగాళ్ల విలువ, అంతర్గత చర్చలు ఆసక్తికరంగా ఉన్నాయి.
సంజు శాంసన్, రవీంద్ర జడేజా ఇద్దరినీ గత సీజన్లో వారి ఫ్రాంఛైజీలు రూ.18 కోట్ల చొప్పున రిటైన్ చేసుకున్నాయి. అంటే, ఇద్దరు అత్యధిక ధర గల భారతీయ ఆటగాళ్లు ఈ డీల్లో భాగమయ్యారు. శాం కరణ్కు గత సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ రూ.2.4 కోట్ల జీతం ఇచ్చింది. ఇతర మీడియా నివేదికల ప్రకారం.. రాజస్థాన్ రాయల్స్ మేనేజ్మెంట్ మొదట రవీంద్ర జడేజాతో పాటు దక్షిణాఫ్రికా ఆటగాడు డెవాల్డ్ బ్రెవిస్ ను అడిగింది. కానీ సీఎస్కే మేనేజ్మెంట్ ఆ డిమాండ్ను తిరస్కరించిన తర్వాత, ట్రేడ్ డీల్లో శాం కరణ్ పేరు వచ్చి డీల్ ఫైనల్ అయినట్లు తెలుస్తోంది.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




