Telangana: తెలంగాణ పాఠశాల విద్యాశాఖను బలోపేతం చేసేందుకు చర్యలు

Telangana: తెలంగాణ పాఠశాల విద్యాశాఖను బలోపేతం చేసేందుకు చర్యలు
x
Highlights

Telangana: తెలంగాణలో పాఠశాల విద్యాశాఖను బలోపేతం చేసేందుకు అధికారులు చర్యలకు ఉపక్రమించారు. నాన్‌ టీచింగ్‌ స్టాప్‌ను పెంచడం ద్వారా టీచింగ్‌ స్టాఫ్‌ పై పడే భారం తగ్గించే యోచనలో విద్యాశాఖ ఆలోచన చేస్తోంది.

తెలంగాణలో పాఠశాల విద్యాశాఖను బలోపేతం చేసేందుకు అధికారులు చర్యలకు ఉపక్రమించారు. నాన్‌ టీచింగ్‌ స్టాప్‌ను పెంచడం ద్వారా టీచింగ్‌ స్టాఫ్‌ పై పడే భారం తగ్గించే యోచనలో విద్యాశాఖ ఆలోచన చేస్తోంది. దీంతో రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో టీచింగ్‌ స్టాఫ్‌ కు కొంత ఉపశమనం కలిగించాలని అధికారులు భావిస్తున్నారు. నాన్ టీచింగ్ స్టాఫ్ ను రేషనలైజ్ చేయాలని సమాలోచనలు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 4500 మంది వరకు పలు పాఠశాలల్లో వీరు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాన్ టీచింగ్ స్టాఫ్ డేటాను అందించాలని విద్యాశాఖ అధికారులు ఆదేశించినట్లు తెలుస్తోంది. దీని ఆధారంగా నాన్ టీచింగ్ స్టాఫ్ ను ఎక్కడెక్కడికి మార్పులు చేర్పులు చేపట్టాలని నిర్ణయించారు.


తెలంగాణలోని వివిధ జిల్లాల్లో జెడ్పీ స్కూళ్లు కలెక్టర్ల పరిధిలో ఉన్న అంశం కావడంతో ఈ అంశంపై ఆయా జిల్లాల కలెక్టర్లకు లేఖ రాయాలని విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో నాన్ టీచింగ్ స్టాఫ్ దాదాపు 4500 మంది ఉన్నట్లు సమాచారం. పలుచోట్ల ఒకే స్కూల్ లో ఇద్దరు, ముగ్గురు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఎక్కువ మొత్తంలో ఉన్న స్కూల్ లో కనీసం ఒక్కరు కూడా లేకపోవడంతో నాన్ టీచింగ్ వారు చేసే పని మొత్తం టీచింగ్ స్టాఫ్ పై పడుతోంది. ఇప్పటికే విద్యాశాఖ అధికారులు నిత్యం ఏదో ఒక కార్యక్రమం పేరిట అదనపు భారాన్ని మోపుతున్నారని ఉపాధ్యాయ సంఘాలు చెబుతున్నాయి. దీంతో విద్యాశాఖ నాన్ టీచింగ్ స్టాఫ్ ను రేషనలైజేషన్ చేస్తే అయినా కొంతమేర అయినా భారం తగ్గుతుందని భావించి ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఒకేచోట ఇద్దరు లేదా ముగ్గురు నాన్ టీచింగ్ స్టాఫ్ ఉంటే వారిని మరో స్కూల్ కు పంపించేలా ఏర్పాట్లు చేయలాని విద్యాశాఖ అధికారులు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.


బోధనేతర సిబ్బంది అంటే పాఠశాలల్లో బోధించని అడ్మినిస్ట్రేషన్, ఫైనాన్స్, ఐటీ, లైబ్రరీ, కస్టోడియల్ వంటి పనుల్లో సహాయపడే సిబ్బంది. ప్రభుత్వ స్కూల్ లోని విద్యార్థుల సంఖ్య, అవసరాల ఆధారంగా బోధనేతర సిబ్బంది కేటాయింపులను విద్యాశాఖ చేపట్టనున్నట్లు సమాచారం. వనరులను సమర్థవంతంగా ఉపయోగించుకోవడంతో పాటు పాఠశాల కార్యకలాపాలు సజావుగా జరిగేలా చూడటం ప్రధాన లక్ష్యంగా విద్యాశాఖ ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. తద్వారా ప్రభుత్వ ఖర్చులను తగ్గించడం, సమర్థవంతమైన పనితీరును సాధించడం దీని ప్రధాన లక్ష్యంగా చెబుతున్నారు. ఈ ప్రక్రియలో సిబ్బందిని అవసరమైన చోట తరలించడం లేదా సర్దుబాటు చేయడం వంటివి చేయనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories