Addanki: అద్దంకిలో వైసీపీ ‘మోసపోయిన అక్కాచెల్లెమ్మల సభ’: కూటమి ప్రభుత్వంపై చింతలపూడి అశోక్ కుమార్ ఫైర్!
Addanki: ప్రకాశం జిల్లా అద్దంకి వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఇన్ఛార్జ్ చింతలపూడి అశోక్ కుమార్ ఆధ్వర్యంలో ‘మోసపోయిన అక్కాచెల్లెమ్మల సభ’ జరిగింది.
Addanki: అద్దంకిలో వైసీపీ ‘మోసపోయిన అక్కాచెల్లెమ్మల సభ’: కూటమి ప్రభుత్వంపై చింతలపూడి అశోక్ కుమార్ ఫైర్!
ప్రకాశం జిల్లా అద్దంకి పట్టణంలోని వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయంలో మోసపోయిన అక్కాచెల్లెమ్మాల సభ కార్యక్రమాన్ని నిర్వహించిన అద్దంకి వైఎస్ఆర్సిపి ఇంచార్జ్ చింతలపూడి అశోక్ కుమార్ .కూటమి ప్రభుత్వం రెండు సంవత్సరాల కాలంలోరాష్ట్ర ప్రజలని మభ్యపెట్టి మోసం చేసిందన్నారు. వైయస్సార్ పై అబద్ధపు ప్రచారం చేస్తున్నారన్నారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాల్లో ఏ ఒక్కటి అమలు చేయలేదన్నారు.
ఆడబిడ్డ నిధి , అమలుచేయలేదున్నారు, వితంతువులు పింఛన్లు అమలు చేయలేదన్నారు ఆరోగ్యశ్రీ రావలసిన నగదును వాళ్లకు నచ్చిన హాస్పిటల్స్ కు సీఎం రిలీఫ్ ఫండ్ పేరుతో భారీగా మోసాలు చేస్తున్నారని తెలిపారు. రానున్న రోజుల్లో ఈ వెన్నుపోటు ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పి, జగనన్న ప్రభుత్వాన్ని తీసుకురావాలని పిలుపునిచ్చారు.




