డోన్ గావ్‌లో పశువులకు ఉచిత టీకాలు.. గాలికుంటు వ్యాధిపై రైతులు అప్రమత్తంగా ఉండాలి!

పశువులను ప్రాణాంతక వ్యాధుల నుండి రక్షించుకోవాల్సిన బాధ్యత పాడి రైతులపై ఉందని డోన్ గావ్ గ్రామ సర్పంచ్ ఖానాపూరె శ్రీనివాస్ పేర్కొన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 12 March 2026 4:22 PM IST
డోన్ గావ్‌లో పశువులకు ఉచిత టీకాలు.. గాలికుంటు వ్యాధిపై రైతులు అప్రమత్తంగా ఉండాలి!
X

డోన్ గావ్‌లో పశువులకు ఉచిత టీకాలు.. గాలికుంటు వ్యాధిపై రైతులు అప్రమత్తంగా ఉండాలి!

జుక్కల్ (కామారెడ్డి జిల్లా): పశువులను ప్రాణాంతక వ్యాధుల నుండి రక్షించుకోవాల్సిన బాధ్యత పాడి రైతులపై ఉందని డోన్ గావ్ గ్రామ సర్పంచ్ ఖానాపూరె శ్రీనివాస్ పేర్కొన్నారు. గురువారం జుక్కల్ మండల పశువైద్య మరియు పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో డోన్ గావ్ గ్రామంలో పశువులకు ఉచితంగా 'గాలికుంటు' వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఏప్రిల్ 9 వరకు టీకాల పంపిణీ

ఈ సందర్భంగా సర్పంచ్ శ్రీనివాస్ మాట్లాడుతూ, పశువుల ఆరోగ్యంపై రైతులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు. ఆవులు, గేదెలు, దూడలకు గాలికుంటు వ్యాధి సోకకుండా ముందస్తుగా ఈ టీకాలు వేయించడం ఎంతో అవసరమని ఆయన గుర్తుచేశారు. పశువైద్య శాఖ ఆధ్వర్యంలో వచ్చే నెల ఏప్రిల్ 9 వరకు మండలంలోని అన్ని గ్రామాల్లో విడతల వారీగా ఈ టీకాల కార్యక్రమం కొనసాగుతుందని వివరించారు. గ్రామంలోని పాడి రైతులు మరియు పశువుల పెంపకం దారులు ఈ ఉచిత అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

పాల్గొన్న అధికారులు

ఈ కార్యక్రమంలో గోపాలమిత్రలు రవీందర్, అంజయ్య, రాములుతో పాటు పశువైద్య శాఖ సిబ్బంది మరియు అధిక సంఖ్యలో పాడి రైతులు తమ పశువులకు టీకాలు వేయించారు. టీకాలు వేయించిన పశువులకు గుర్తింపు కార్డులను కూడా పరిశీలించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story