Air India: ఎయిరిండియా విమానానికి తప్పిన పెను ప్రమాదం

Air India: ఎయిరిండియా విమానానికి తప్పిన పెను ప్రమాదం
x
Highlights

Air India: విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానానికి పెను ప్రమాదం తప్పింది.

విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానానికి పెను ప్రమాదం తప్పింది. మధ్యాహ్నం 2:20 గంటలకు బయలుదేరిన కొద్దిసేపటికే విమానం రెక్కలో పక్షి చిక్కుకుంది. దీంతో ఇంజిన్ ఫ్యాన్ దెబ్బతింది. అప్రమత్తమైన పైలట్ విమానాన్ని వెంటనే వెనక్కి మళ్లించి విశాఖపట్నం విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ చేశారు.

ఈ ఘటన జరిగిన సమయంలో విమానంలో 103 మంది ప్రయాణికులు ఉన్నారు. వారికోసం ఎయిర్ ఇండియా అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. పైలట్ సమయస్ఫూర్తితో వ్యవహరించడం వల్ల పెను ప్రమాదం తప్పిందని అధికారులు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories