
అమరావతి : బ్రాహ్మణ కో ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ తరహాలో అన్ని ఈడబ్ల్యూఎస్, కాపు కార్పొరేషన్ లో కూడా క్రెడిట్ కో ఆపరేటివ్ సొసైటీల ఏర్పాటు చేయనున్నట్లు...
అమరావతి : బ్రాహ్మణ కో ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ తరహాలో అన్ని ఈడబ్ల్యూఎస్, కాపు కార్పొరేషన్ లో కూడా క్రెడిట్ కో ఆపరేటివ్ సొసైటీల ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామిక వేత్తను తీర్చిదిద్దే లక్ష్యంలో భాగంగా ప్రతి నియోజక వర్గంలోనూ ఏర్పాటు చేయనున్నట్లు ఎంఎస్ఎంఈ పార్కుల్లో ఈడబ్ల్యూఎస్ సామాజిక వర్గీయులకు ప్రాధాన్యమిస్తున్నామని వెల్లడించారు. అమరావతిలో రాష్ట్ర సచివాలయంలో ఈడబ్ల్యూఎస్, కాపు కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లతో మంత్రి సవిత శుక్రవారం ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈడబ్ల్యూఎస్ సామాజిక వర్గీయుల ఆర్థిక వృద్ధికి ఆయా కార్పొరేషన్ల ఆధ్వర్యంలో చేపట్టాలని సంక్షేమ పథకాల అమలుపై సమావేశంలో చర్చించారు. ఈడబ్ల్యూఎస్ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు, ఆయా కుల సంఘాల ప్రతినిధులతో విడివిడిగా సమావేశాలు నిర్వహించి, అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ, కాపు, బ్రాహ్మణ, ఆర్యవైశ్య, కమ్మ, రెడ్డి, క్షత్రియ, ఇతర ఈబీసీ కులాల సాధికారితకు పలు సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నామన్నారు. ఈడబ్ల్యూఎస్ కులాల అభ్యున్నతే సీఎం చంద్రబాబు ప్రధాన లక్ష్యమన్నారు. వివిధ పథకాల అమలులో భాగంగా 2025-26 బడ్జెట్ లో ఈడబ్ల్యూఎస్ కార్పొరేషన్లకు కూటమి ప్రభుత్వం రూ.10,608.61 కోట్లు కేటాయించిందన్నారు. వాటిలో ఈబీసీలకు రూ. 915.28 కోట్లు, కమ్మ కార్పొరేషన్ కు రూ.1,711.42 కోట్లు, రెడ్డి కార్పొరేషన్ కు రూ.1,946.36 కోట్లు, క్షత్రియ కార్పొరేషన్ కు రూ.260.20 కోట్లు, కాపు కార్పొరేషన్ కు రూ.4,884.83 కోట్లు, ఆర్యవైశ్య కార్పొరేషన్ కు రూ.545.05 కోట్లు. బ్రాహ్మణ కార్పొరేషన్ కు రూ.345.46 కోట్లు కేటాయించామన్నారు.
కాపుల అభ్యున్నతికి పెద్దపీట
కాపుల అభ్యున్నతి కోసం సీఎం చంద్రబాబు పెద్దపీట వేస్తున్నారని మంత్రి సవిత తెలిపారు. 2014-19లో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం రూ.172 కోట్లతో మంజూరు చేసిన 13 జిల్లా స్థాయి కాపు భవనాలను, 487 మినీ కాపు భవనాలు/కాపు కమ్యూనిటీ హాళ్లను గాలి కొదిలేసిందన్నారు. తొమ్మి జిల్లా స్థాయి కాపు భవనాలను, 421 మినీ కాపు భవనాలు/కాపు కమ్యూనిటీ హాళ్లను రద్దు చేసిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే విశాఖపట్నం, నెల్లూరు జిల్లా స్థాయి కాపు భవనాలను, అయిదు కాపు కమ్యూనిటీ హాళ్ల నిర్మాణాలను పూర్తి చేసిందన్నారు. 50 శాతం పనులతో అసంపూర్తిగా నిలిచిపోయిన తిరుపతి, కర్నూలు జిల్లా స్థాయి కాపు భవనాలను, 70 శాతం పూర్తయిన 39 కాపు మినీ కమ్యూనిటీ హాళ్ల నిర్మాణాలను త్వరలోనే పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. కాపులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చుతామని మంత్రి సవిత స్పష్టంచేశారు.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




