Pawan Kalyan: సీఎం చంద్రబాబుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

Pawan Kalyan: సీఎం చంద్రబాబుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
x

Pawan Kalyan: సీఎం చంద్రబాబుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

Highlights

సముద్రంలో చేపల వేటకు వెళ్లి ప్రాణాలు కోల్పోయిన మత్స్యకార కుటుంబాలకు ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం అండగా నిలిచింది.

సముద్రంలో చేపల వేటకు వెళ్లి ప్రాణాలు కోల్పోయిన మత్స్యకార కుటుంబాలకు ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం అండగా నిలిచింది. ఈ విషయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రత్యేక చొరవ తీసుకొని, కాకినాడ జిల్లాకు చెందిన 18 బాధిత కుటుంబాలకు తక్షణమే ఆర్థిక సహాయం అందేలా కీలక పాత్ర పోషించారు.

ప్రభుత్వం ఒక్కో కుటుంబానికి రూ. 5 లక్షల చొప్పున, మొత్తం రూ. 90 లక్షల పరిహారాన్ని మంజూరు చేసింది. దురదృష్టవశాత్తు ప్రాణాలు విడిచిన మత్స్యకారుల కుటుంబాలను ఆదుకోవాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఈ సందర్భంగా, మత్స్యకార కుటుంబాలకు అండగా నిలిచి, పరిహారం మంజూరుకు సహకరించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. ప్రభుత్వం ప్రకటించిన ఈ ఆర్థిక సాయం బాధిత కుటుంబాలకు కొంతమేర ఊరట కలిగించనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories