Chandrababu Naidu: వర్షంలో తన గొడుగు తానే పట్టుకుని వెళ్లిన సీఎం చంద్రబాబు


Chandrababu Naidu: వర్షంలో తన గొడుగు తానే పట్టుకుని వెళ్లిన సీఎం చంద్రబాబు
Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి తన నిరాడంబరతను చాటుకున్నారు. అధికార గౌరవాలు, ఆడంబరాలకు దూరంగా ఉండే ఆయన, ఇవాళ తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ సమావేశానికి హాజరయ్యే సమయంలో స్వయంగా గొడుగు పట్టుకుని నడిచారు.
Chandrababu Naidu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరోసారి తన నిరాడంబరతను చాటుకున్నారు. అధికార గౌరవాలు, ఆడంబరాలకు దూరంగా ఉండే ఆయన, ఇవాళ తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ సమావేశానికి హాజరయ్యే సమయంలో స్వయంగా గొడుగు పట్టుకుని నడిచారు.
ఈ సమావేశం గుంటూరు జిల్లా ఉండవల్లిలో జరిగింది. అదే సమయంలో అక్కడ వర్షం కురుస్తుండగా, పక్కనే భద్రతా సిబ్బంది ఉన్నప్పటికీ, వారెవరికీ పట్టించుకోకుండా చంద్రబాబు తానే గొడుగు పట్టుకుని చలాకీగా సమావేశ స్థలానికి నడుచుకుంటూ వెళ్లారు. ఆయన ఈ చర్య పార్టీలోని నేతలతో పాటు ప్రజల్లోనూ విశేషంగా చర్చనీయాంశమైంది.
టీడీపీ అధికారిక సోషల్ మీడియా ఖాతా ఈ సంఘటనకు సంబంధించిన ఫొటోలను షేర్ చేస్తూ —
"ఎండైనా... వానైనా... దార్శనికుడి ముందడుగు... తానే పట్టాడు గొడుగు..."
అనే క్యాప్షన్తో పోస్ట్ చేసింది. ఈ ఫొటోలు క్షణాల్లో వైరల్ అయ్యాయి.
75 ఏళ్ల వయసులోనూ చురుకుగా, ప్రజల ముంగిట ఉంటూ పని చేసే చంద్రబాబు నాయుడు మరొకసారి తన వృత్తిపరమైన నిబద్ధతను చాటుకున్నారు.
ఎండైనా.. వానైనా..
— Telugu Desam Party (@JaiTDP) July 18, 2025
దార్శనికుడి ముందడుగు..
తానే పట్టాడు గొడుగు..
ఉండవల్లి నివాసంలో టిడిపిపి సమావేశానికి వర్షంలో గొడుగు పట్టుకుని వెళ్తున్న సీఎం చంద్రబాబు గారు..#ChandrababuNaidu #AndhraPradesh pic.twitter.com/xAEgVsUsUG

About

HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire