అధికారులను సున్నితంగా హెచ్చరించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

అధికారులను సున్నితంగా హెచ్చరించిన  డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
x

అధికారులను సున్నితంగా హెచ్చరించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

Highlights

శంకరగుప్తం డ్రైన్ సమస్యపై తన పేషీ అధికారులు ఇచ్చిన నివేదికను చదివి వినిపించిన పవన్ కళ్యాణ్

రాజోలు: అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా కేశనపల్లిలో సముద్ర జలాలతో దెబ్బ తిన్న లక్షలాది కొబ్బరి చెట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వరాలు ఇవ్వడానికి తాను సీఎం కాదని.. ఆయన దృష్టికి తీసుకుని వెళ్తానని.. డిసెంబర్ రెండో వారంలో మళ్ళీ వస్తానని తెలిపారు. కోనసీమ డ్రైనేజీ వ్యవస్థ ఆధునీకరణ మీద బీసీ రోశయ్య ఇచ్చిన నివేదిక ఆధారంగా అధికారులు స్టడీ చేసి రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించారు. అలాగే, కోకొనట్ బోర్డ్ ఏర్పాటు మీద క్యాబినెట్ లో చర్చిస్తానని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెల్లడించారు. కోనసీమ కొబ్బరిని పరిరక్షించుకోవాలి అని పవన్ కళ్యాణ్ తెలిపారు. గత ప్రభుత్వంలో అభివృద్ధి మరచిపోయారని, ఓట్లు కోసమో, హడావుడి చేయడానికి ఇక్కడికి రాలేదన్నారు.


కోనసీమ రైతాంగం గళం అవుతానని అన్నారు. సర్వీస్ రూల్స్ లేకుండా సచివాలయం ఉద్యోగులు విషయంలో గత ప్రభుత్వంలో ప్రవర్తించింది. ప్రజలను మభ్య పెట్టడానికి తాను రాలేదని చెప్పారు. గత సీఎంలా తన దగ్గర డబ్బులు లేవని, కోనసీమ కొబ్బరి రైతులకి శాశ్వత పరిష్కారం కావాలని మూలాలు తెలుసుకోవాలన్నారు. కొబ్బరి చెట్టు ఇంటికి పెద్ద కొడుకు లాంటిదని డిప్యూటీ సీఎం పవన్ చెప్పుకొచ్చారు. ఈయన వెంట కలెక్టర్ మహేష్, ఎంపి హరీష్ మాదుర్, రాజోలు ఎంఎల్ఎ దేవ వరప్రసాద్ ఉన్నారు. అదికార యంత్రాంగం ఉన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories