Gandikota Festival 2026 అంతా సిద్ధం.. మూడు రోజుల పాటు వేడుకల జాతర!

Gandikota Festival 2026  అంతా సిద్ధం.. మూడు రోజుల పాటు వేడుకల జాతర!
x
Highlights

కడప జిల్లాలో గండికోట ఉత్సవాలకు రంగం సిద్ధమైంది. మరోవైపు హైదరాబాద్‌లో అభిమానులతో కేసీఆర్ ముచ్చటించగా, విజయవాడలో సీఎం చంద్రబాబు క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. పూర్తి వివరాలు ఇక్కడ..

ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో 'గండికోట ఉత్సవాలు - 2026' అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. కడప జిల్లాలోని చారిత్రక గండికోట వైభవాన్ని ప్రపంచానికి చాటిచెప్పేలా జనవరి 11, 12, 13 తేదీల్లో ఈ వేడుకలు జరగనున్నాయి. ఈ ఏడాది పర్యాటకుల కోసం మునుపెన్నడూ లేని విధంగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా సాగే ఈ ఉత్సవాలకు పర్యాటకులు భారీగా తరలివచ్చే అవకాశం ఉంది.

నంది నగర్‌లో సందడి.. అభిమానులతో కేసీఆర్ ఫోటోలు!

హైదరాబాద్: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసేందుకు అభిమానులు, కార్యకర్తలు ఆయన నివాసానికి భారీగా తరలివచ్చారు. దాదాపు 4 గంటల పాటు సమయం వెచ్చించిన కేసీఆర్, సుమారు 1000 మందికి పైగా అభిమానులతో వ్యక్తిగతంగా ఫోటోలు దిగారు. గులాబీ బాస్ సందడితో నంది నగర్ ప్రాంతం కోలాహలంగా మారింది.

విజయవాడలో క్రిస్మస్ సంబరాలు.. హాజరైన సీఎం చంద్రబాబు

విజయవాడ: నగరంలోని ఏ కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. కేక్ కట్ చేసి క్రైస్తవ మత పెద్దల ఆశీస్సులు తీసుకున్న ఆయన.. గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన క్రైస్తవుల సంక్షేమ పథకాలను కూటమి ప్రభుత్వం పునరుద్ధరిస్తుందని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో మత సామరస్యాన్ని కాపాడడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.

రాష్ట్రపతి ముర్ముకు వీడ్కోలు పలికిన గవర్నర్, సీఎం రేవంత్

హైదరాబాద్: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆరు రోజుల శీతాకాల విడిది ముగిసింది. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో విడిది ముగించుకున్న ఆమె, ప్రత్యేక విమానంలో ఢిల్లీ పయనమయ్యారు. హకీంపేట ఎయిర్‌పోర్టులో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి మరియు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆమెకు సాదరంగా వీడ్కోలు పలికారు.

సింహాద్రి అప్పన్న సన్నిధిలో భారత మహిళా క్రికెటర్లు

విశాఖపట్నం: భారత మహిళా అంతర్జాతీయ క్రికెట్ జట్టు సభ్యులు సోమవారం ఉదయం సింహాచలం వరాహ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు క్రీడాకారిణులకు ఘనస్వాగతం పలికి, ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేసి ఆలయ మర్యాదలతో గౌరవించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories