Guntur: గుంటూరులో దారుణం.. ప్రియుడి కోసం భర్తను చంపి.. శవం పక్కనే రాత్రంతా పోర్న్ వీడియోలు చూస్తూ గడిపిన భార్య!

Guntur Crime News: Wife Kills Husband with Lover Help in Chiluvuru - Shocking Details of Laxmi Madhuri Case
x

గుంటూరులో దారుణం.. ప్రియుడి కోసం భర్తను చంపి.. శవం పక్కనే రాత్రంతా పోర్న్ వీడియోలు చూస్తూ గడిపిన భార్య!

Highlights

Guntur: గుంటూరు జిల్లాలో వివాహేతర సంబంధం కోసం కట్టుకున్న భర్తను చంపిన భార్య. ప్రియుడితో కలిసి నిద్రమాత్రలు ఇచ్చి, ఊపిరాడకుండా చేసి హత్య. నాగరాజు మృతి కేసులో బయటపడ్డ దిగ్భ్రాంతికర నిజాలు మరియు లక్ష్మీమాధురి అరెస్ట్ వివరాలు.

వివాహేతర సంబంధాలు పచ్చని సంసారాల్లో చిచ్చు రేపుతున్నాయి. ప్రియుడి వ్యామోహంలో పడి కట్టుకున్న భర్తనే కడతేర్చిందో కిరాతక భార్య. హత్య చేసిన తర్వాత ఏమాత్రం పశ్చాత్తాపం లేకుండా, భర్త శవం పక్కనే ఉందన్న భయం కూడా లేకుండా రాత్రంతా ఫోన్‌లో పోర్న్ వీడియోలు చూస్తూ గడిపిన ఘటన గుంటూరు జిల్లాలో సంచలనం సృష్టిస్తోంది.

అసలేం జరిగింది?

దుగ్గిరాల మండలం చిలువూరుకు చెందిన శివనాగరాజు (ఉల్లిపాయల వ్యాపారి) కి, లక్ష్మీమాధురికి 2007లో వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు. విజయవాడలోని ఒక సినిమా థియేటర్లో టికెట్ కౌంటర్లో పనిచేస్తున్న సమయంలో మాధురికి, గోపి అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అది కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది.

పక్కా ప్లాన్‌తో హత్య:

తన వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన మాధురి, ప్రియుడు గోపితో కలిసి అతడిని వదిలించుకోవాలని నిర్ణయించుకుంది.

నిద్రమాత్రలు: ఈ నెల 18న రాత్రి భర్త కోసం చేసిన బిర్యానీలో 20 నిద్రమాత్రలను పొడిగా చేసి కలిపింది.

హత్య చేసిన తీరు: నాగరాజు గాఢ నిద్రలోకి జారుకున్నాక, అర్ధరాత్రి 11.30 గంటలకు ప్రియుడు గోపి ఇంటికి వచ్చాడు. గోపి నాగరాజు ఛాతీపై కూర్చుని అణచివేయగా, మాధురి దిండుతో భర్త ముక్కు, నోరు నొక్కిపట్టి ఊపిరాడకుండా చేసి చంపేసింది.

శవం పక్కనే వికృత చేష్టలు:

భర్త చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత గోపి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అయితే, మాధురి ఏమాత్రం చలించకుండా తెల్లవార్లూ ఫోన్‌లో పోర్న్ వీడియోలు చూస్తూ కాలక్షేపం చేసింది. ఉదయం 4 గంటల సమయంలో చుట్టుపక్కల వారిని పిలిచి, తన భర్తకు గుండెపోటు వచ్చిందని డ్రామా ఆడింది.

చిక్కారు ఇలా..

అంత్యక్రియల సమయంలో నాగరాజు చెవి నుంచి రక్తం రావడాన్ని గమనించిన స్నేహితులు అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోస్టుమార్టం నివేదికలో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి:

నాగరాజు ఛాతీ ఎముకలు విరిగాయని తేలింది.

ఊపిరాడకుండా చేయడం వల్లే మరణం సంభవించిందని పోస్టుమార్టం రిపోర్ట్ స్పష్టం చేసింది.

పోలీసుల విచారణలో మాధురి తన నేరాన్ని అంగీకరించింది. పోలీసులు మాధురిని, ఆమె ప్రియుడు గోపిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories