తిరుపతి లడ్డూ ప్రసాదానికి 307 ఏళ్లు

It Has Been 307 Years Since Tirupati Laddu Start
x

తిరుపతి లడ్డూ ప్రసాదానికి 307 ఏళ్లు

Highlights

Tirupati Laddu: బూందీ బదులుగా లడ్డూని ప్రవేశపెట్టిన అర్చకులు

Tirupati Laddu: తిరుమల వెంకన్న కోరిన కోర్కెలు తీర్చే దేవదేవుడని, తమ కష్టాలను తొలగించే దివ్య పురుషుడని భక్తుల విశ్వాసం. అందుకే నిత్యం లక్షల సంఖ్యలో భక్తులు తిరుమలకు వస్తుంటారు. ఇక్కడికి వచ్చిన భక్తులు స్వామి వారి దర్శన అనంతరం, స్వామి వారి ప్రసాదమైన లడ్డూనూ తమతో పాటూ ఇంటికి తీసుకెళ్తారు. ఈ లడ్డూను తమ ఇంటిలో భక్తి శ్రద్దలతో పూజించి ఆత్మీయులకు పంచిపెడుతుంటారు. ఇంతకి శ్రీవారి లడ్డూ ప్రసాదం ఎప్పుడూ తయారు అయ్యింది..? శ్రీవారి‌ లడ్డూ ప్రసాదం మొదలు పెట్టి ఎన్నేళ్ళు అయ్యింది. వాచ్ దిస్ స్టోరీ.

తిరుమల శ్రీవారికి సమర్పించే నైవేద్యాలకి పెద్ద చరిత్రే ఉంది. సుప్రభాత సమయంలో స్వామి వారికి వెన్నతో మొదలు పెట్టి, లడ్డూ, వడ, పోంగలి, దద్దోజనం, పులిహోరా, వడపప్పు, ఇలా రకరకాల నైవేద్యాలను నివేదిస్తారు. తిరుమల అనగానే మనకు లడ్డూ మాత్రమే గుర్తుకు వస్తుంది. శ్రీవారికి ప్రాచీన కాలంలో నుంచి అనేక ప్రసాదాలను నివేదిస్తున్నప్పటికీ.. మనకి పల్లవుల కాలం నుంచే ప్రసాదాలు చారిత్రక ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. విజయనగర సామ్రాజ్యంలోని రెండవ దేవరాయలు కాలం నుండి ప్రసాదాల సంఖ్య, మరింత ఎక్కువ పెంచినట్టు ఆధారాలున్నాయి. ఈ సమయంలో ప్రభుత్వంలో మంత్రిగా పని చేసిన శేఖర మల్లన్న, కేవలం ఆలయ ప్రసాదాల కోసమే అనేక దానాలు చేసినట్టు తెలుస్తుంది. రెండవ దేవరాయల కాలంలోనే స్వామి వారికి నివేదించాల్సిన ప్రసాదాలు, సమయాన్ని బట్టి ఖరారు చేసినట్టు చారిత్రక ఆధారాలున్నాయి.

శ్రీవారి ఆలయంలో స్వామి వారికి రకరకాల ప్రసాదాలు నివేదిస్తునప్పటికీ, స్వామి వారికి అత్యంత ఇష్టమైన ప్రసాదం లడ్డూ. ప్రస్తుతం ఆలయంలో ఉన్న ప్రసాదాల్లో లడ్డూను పురాణకాలం నుంచి స్వామి వారికి నివేదిస్తున్నటు తెలుస్తుంది.14వందల 55వ సంవత్సరంలో సుఖీయం, అప్పంను, 14వందల 60 లో వడను, 14వందల 68లో అత్తిరసంను, 15వందల 47లో మనోహరపడి ప్రసాదాలను ప్రవేశ పెట్టినట్టు చారిత్రక ఆధారాలున్నాయి. వీటిలో వడ తప్ప మిగతావేవీ ఎక్కువ రోజులు నిల్వ ఉండే అవకాశం లేదు.. అయితే అది గుర్తించిన అప్పటి మద్రాసు ప్రభుత్వం తొలిసారిగా 18వందల3 నుండి శ్రీవారి ఆలయంలో ప్రసాదాలు విక్రయించడం ప్రారంభించింది. నాటి నుంచి లడ్డూకు ముందు రూపమైన బూందీని తీపి ప్రసాదంగా విక్రయించడం ప్రారంభించారు. ఇలా అనేక విధాలుగా మారుతూ వచ్చిన ప్రసాదాల స్వరూపం చివరకు 19వందల 40లో తిరుపతి లడ్డూగా స్థిరపడింది.

తిరుమల శ్రీవారి లడ్డు తయారీ కోసం ప్రత్యేకమైన పద్దతులను టీటీడీ పాటిస్తోంది. ఈ ప్రసాదం తయారీ కోసం స్వచ్చమైన శనగ పిండి, పటిక బెల్లం, నెయ్యి, ఎండు ద్రాక్ష, యాలాకులు, జీడీపప్పు, పచ్చకర్పూరం మొదలైన పదార్ధాలు ఉపయోగిస్తారు. 51 లడ్డూలను ఒక ప్రోక్తం అంటారు. ఒక్కోసారి సుమారు వెయ్యి ప్రోక్తాలను తిరుమలలో తయారు చేస్తారు. అంటే 51 వేల లడ్డూలన్న మాట. ఇందుకు గాను 2వేల కిలోల శనగ పిండి, 4వేల కిలోల చక్కెర, 18వందల 50 కిలోల నెయ్యి, 350 కిలోల జీడిపప్పు, 80 ఏడున్నర కిలోల ఎండుద్రాక్ష, 50 కిలోల యాలకులు, 50 కిలోల కలకండ అవసరం అవుతుంది. రోజుకు లక్షా పాతిక వేల లడ్డూలను టీటీడీ కార్మికులు తయారు చేస్తున్నారు.

టీటీడీలో రకరకాలైన ప్రసాదాలు అందుబాటులో ఉన్నప్పటికి, భక్తులకు లడ్డూ ప్రసాదం అంటేనే ఎంతో‌ ప్రీతిపాత్రంగా ఉంటుంది. ఈ లడ్డూ ప్రసాదాల విక్రయాలతో, ప్రతి ఏటా టీటీడీ కోట్ల రూపాయలు ఆదాయంగా పొందుతూ వస్తోంది. ఇక శ్రీవారి లడ్డూ ప్రసాదంగా లడ్డూను ఇవ్వడం 17వందల 15 ఆగస్టు 2 వ తేదీన మెదలుపెట్టారని తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకూ ఎవరూ ఇందుకు సంబంధించిన ఖచ్చితమైన తేదీని మాత్రం చెప్పలేక పోతున్నారు. 2వేల 10 వరకూ దాదాపు రోజుకు లక్షల లడ్డూలను టీటీడీ తయారు చేసేది.‌ భక్తుల అధిక రద్దీ నేపధ్యంలో ప్రతి నిత్యం దాదాపు మూడు లక్షల ఇరవై వేల లడ్డూలను టీటీడీ తయారు చేస్తోంది. ఇక లడ్డూకు పేటేంట్, ట్రేడ్ మార్క్ కూడా ఉండడం విశేషంగా చెప్పుకోవచ్చు. జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ కార్యాలయం నుండి‌ 2వేల 14లో రిజిస్ట్రేషన్ అవుతూ, జియోగ్రాఫికల్ ఇండికేషన్ స్టేటస్ కూడా లడ్డూకు లభించింది.


Show Full Article
Print Article
Next Story
More Stories