Kurnool Bus Accident: కర్నూలు ఘటన.. దగ్ధమైన బస్సు నుంచి 19 మృతదేహాల వెలికితీత

Kurnool Bus Accident: కర్నూలు ఘటన.. దగ్ధమైన బస్సు నుంచి 19 మృతదేహాల వెలికితీత
Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాదంలో ఇప్పటివరకు 19 మంది మృతదేహాలు వెలికితీశారు.
Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాదంలో ఇప్పటివరకు 19 మంది మృతదేహాలు వెలికితీశారు. ప్రమాదంలో బైకర్ శివశంకర్ కూడా మృతి చెందాడు. ప్రమాద సమయంలో బస్సులో 43 మంది ఉండగా...23మంది ప్రయాణికులు క్షేమంగా బయటపడ్డారు. ప్రమాదంలో 11మంది ప్రయాణికులు గాయపడ్డారు. అమృత్ కుమార్ అనే వ్యక్తి ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. కర్నూలు ప్రభుత్వాస్పత్రిలో క్షతగాత్రులకు చికిత్స కొనసాగుతోంది. ఏడుగురు డిశ్చార్జ్ కాగా నలుగురికి చికిత్స జరుగుతోంది.
ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు శివారు చిన్నటేకూరు వద్ద ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఆగ్నికి ఆహుతైంది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తుండగా బస్సును ఓ బైక్ ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి, బస్సు అంతా వ్యాపించాయి. చూస్తుండగానే బస్సు పూర్తిగా దగ్ధమైంది.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



