గూగుల్, అడోబ్ సీఈవోలతో మంత్రి లోకేష్ భేటీ

గూగుల్, అడోబ్ సీఈవోలతో మంత్రి లోకేష్ భేటీ
x
Highlights

గూగుల్ సంస్థ సీఈవో సుందర్ పిచాయ్ తో అడోబ్ సీఈవో శంతను నారాయణన్ తో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు.

శాన్ ఫ్రాన్సిస్కో (యూఎస్ఏ): గూగుల్ సంస్థ సీఈవో సుందర్ పిచాయ్ తో అడోబ్ సీఈవో శంతను నారాయణన్ తో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. సుందర్ పిచాయ్ తో జరిగిన భేటీలో గూగుల్ క్లౌడ్ సీఈవో థామస్ కురియన్, వైస్ ప్రెసిడెంట్ బికాష్ కోలే (గ్లోబల్ నెట్ వర్కింగ్ & ఇన్ ఫ్రాస్ట్రక్చర్), బికాష్ కోలే వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ గ్లోబల్ నెట్ వర్కింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, థామస్ కురియన్ సిఈఓ గూగుల్ క్లౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విశాఖలో $15బిలియన్ డాలర్ల పెట్టుబడులకు ముందుకు వచ్చినందుకు గూగుల్ ఉన్నతస్థాయి బృందానికి మంలు, డిజిటల్ హెల్త్ పైలట్ ప్రాజెక్టులలో భాగస్వామ్యం వహించేలా ప్రోత్సహించండి. ఆంధ్రప్రదేశ్‌లోని ఫార్మా జోన్లు, AMTZ (అంధ్రా మెడ్ టెక్ జోన్) సామర్థ్యాలను వినియోగించుకునేలా చొరవ చూపండి. మీరు డైరెక్టర్ గా కలిగిన మరో సంస్థ కెకెఆర్ ప్రధానంగా ఆరోగ్యం, ఔషధ పరిశోధన, బయో-ఫార్మాస్యూటికల్స్, ఎనర్జీ పైప్ లైన్లు మొదలైన రంగాల్లో కీలకమైన ఉనికిని కలిగి ఉంది. (కేకేఆర్ సుమారు USD 750 బిలియన్ విలువైన ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ.) ఏపీలోని ఆరోగ్య సంరక్షణ రంగంలో ఆ సంస్థ పెట్టుబడులు పెట్టేలా సహకారం అందించాల్సిందిగా మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు. అడోబ్ సీఈవో శంతను నారాయణన్ మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిపాదనలపై సహచరులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.త్రి లోకేష్ కృతజ్ఞతలు తెలిపారు. విశాఖపట్నంలో AI డేటా సెంటర్ ప్రాజెక్ట్ పనులను ప్రారంభించడం, అమలుకాలంపై చర్చించారు. మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. విస్ట్రాన్ న్యూ వెబ్ కార్పోరేషన్ ద్వారా డేటా సెంటర్–సర్వర్ తయారీ ఎకోసిస్టమ్ ను ప్రోత్సహించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ లో రాబోయే డ్రోన్ సిటీ ప్రాజెక్టులో డ్రోన్ అసెంబ్లీ, కేలిబ్రేషన్, టెస్టింగ్ యూనిట్ ను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ మాట్లాడుతూ... భారత్ లో క్లౌడ్ రీజియన్‌ల విస్తరణతోపాటు “గూగుల్ ఫర్ స్టార్టప్స్ యాక్సిలరేటర్” ద్వారా స్టార్టప్‌లకు మద్దతు ఇస్తున్నట్లు చెప్పారు. విశాఖపట్నంలో గూగుల్ ప్రకటించిన $15 బిలియన్ విలువైన AI డేటా సెంటర్ అమెరికా వెలుపల అతిపెద్ద ఎఫ్ డీఐగా పేర్కొన్నారు. ప్రస్తుతం చెన్నైలో ఫాక్స్‌కాన్‌తో కాంట్రాక్ట్ మాన్యుఫాక్చరింగ్ ద్వారా గూగుల్ డ్రోన్లు “వింగ్స్” తయారవుతున్నాయని తెలిపారు. గూగుల్ ఉత్పత్తులను ప్రతి నెలా 500 మిలియన్లకు పైగా ఇంటర్నెట్ వినియోగదారులు ఉపయోగిస్తున్నారని చెప్పారు. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలపై సంస్థలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని సుందర్ పిచాయ్ తెలిపారు.

ఏపీలో అడోబ్ జీసీసీ సెంటర్ ఏర్పాటు చేయండి

అడోబ్ సీఈవో శంతను నారాయణన్ తో జరిగిన భేటీలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ.... ‘‘విశాఖపట్నంలో అడోబ్ జీసీసీ (గ్లోబల్ కేపబిలిటీ సెంటర్) లేదా డెవలప్ మెంట్ సెంటర్ ను ఏర్పాటు చేయండి. ఆంధ్రప్రదేశ్‌ను అమెరికా టెక్ సంస్థలైన ఇంటెల్, ఏఎండీ, అప్లైడ్ మెటీరియల్స్ వంటి వాటితో అనుసంధానించి ఫ్యాబ్‌లెస్ డిజైన్, పరిశోధన, తయారీ కేంద్రాల అభివృద్ధిని ప్రోత్సహించేలా చొరవ చూపండి. మీరు డైరెక్టర్ గా ఉన్న ఫైజర్ సంస్థ ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ఔషధ పరిశ్రమ జోన్లలో (విశాఖపట్నం ఏఎంటీజడ్) వ్యాక్సిన్లు, చిన్న మాలిక్యూల్స్ లేదా బయోలాజిక్స్ తయారీ ప్లాంట్‌ ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించండి. ఆంధ్రప్రదేశ్ పరిశోధనా సంస్థలతో కలిసి క్లినికల్ ట్రయల్స్, వ్యాధి వ్యాప్తి అధ్యయనాలు, డిజిటల్ హెల్త్ పైలట్ ప్రాజెక్టులలో భాగస్వామ్యం వహించేలా ప్రోత్సహించండి. ఆంధ్రప్రదేశ్‌లోని ఫార్మా జోన్లు, AMTZ (అంధ్రా మెడ్ టెక్ జోన్) సామర్థ్యాలను వినియోగించుకునేలా చొరవ చూపండి. మీరు డైరెక్టర్ గా కలిగిన మరో సంస్థ కెకెఆర్ ప్రధానంగా ఆరోగ్యం, ఔషధ పరిశోధన, బయో-ఫార్మాస్యూటికల్స్, ఎనర్జీ పైప్ లైన్లు మొదలైన రంగాల్లో కీలకమైన ఉనికిని కలిగి ఉంది. (కేకేఆర్ సుమారు USD 750 బిలియన్ విలువైన ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ.) ఏపీలోని ఆరోగ్య సంరక్షణ రంగంలో ఆ సంస్థ పెట్టుబడులు పెట్టేలా సహకారం అందించాల్సిందిగా మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు. అడోబ్ సీఈవో శంతను నారాయణన్ మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిపాదనలపై సహచరులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories