చంద్రబాబు అరెస్ట్ను ఖండించిన మోత్కుపల్లి నర్సింహులు
Motkupalli Narasimhulu: రాజమండ్రి వెళ్లి జగన్ ను కలుస్తానన్న మోత్కుపల్లి
చంద్రబాబు అరెస్ట్ను ఖండించిన మోత్కుపల్లి నర్సింహులు
Motkupalli Narasimhulu: చంద్రబాబు అరెస్ట్ను మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత మోత్కుపల్లి నరసింహులు తీవ్రంగా ఖండించారు. జగన్ గెలిచిన తరువాత మైకంలోకి వెళిపోయాడన్నారు. రాష్ట్రానికి రాజధాని కూడా లేకుండా చేశాడన్నారు. చంద్రబాబును అరెస్ట్ చేసి జగన్ రాక్షసానందం పొందుతున్నాడన్నారు. చంద్రబాబు మరణిస్తే దానికి బాధ్యత ఎవరు వహిస్తారన్నారు. రెండు మూడు రోజుల్లో రాజమండ్రి వెళ్లి చంద్రబాబును కలుస్తానని,, వారి కుటుంబ సభ్యులను పరామర్శిస్తానన్నారు. ఎన్టీఆర్ ఘాట్ కు చేరుకుని ఎన్టీఆర్ సమాధికి నివాళులర్పించారు మోత్కుపల్లి నర్సింహులు.
Next Story




