Vande Bharat: నరసాపురం-చెన్నై వందేభారత్ ఎక్స్ప్రెస్ ప్రారంభం

Vande Bharat: నరసాపురం-చెన్నై మధ్య నడిచే వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలు సర్వీసు నేడు (డిసెంబర్ 15, 2025) నరసాపురం స్టేషన్ నుంచి లాంఛనంగా ప్రారంభమైంది.
Vande Bharat: నరసాపురం-చెన్నై మధ్య నడిచే వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలు సర్వీసు నేడు (డిసెంబర్ 15, 2025) నరసాపురం స్టేషన్ నుంచి లాంఛనంగా ప్రారంభమైంది. కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ గారు పచ్చజెండా ఊపి ఈ రైలును ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఉపసభాపతి రఘురామకృష్ణ రాజు, బొమ్మిడి నాయకర్, బొలిశెట్టి, ఇతర రైల్వే మరియు ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.
వాస్తవానికి, ఈ వందేభారత్ ఎక్స్ప్రెస్ ఇంతకుముందు చెన్నై సెంట్రల్ – విజయవాడ మధ్య నడుస్తుండేది. ఇటీవల, రైల్వే బోర్డు ఈ సర్వీసును నరసాపురం వరకు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. చెన్నై సెంట్రల్లో ఉదయం 5:30 గంటలకు బయలుదేరే ఈ రైలు...రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, తెనాలి స్టేషన్ల మీదుగా విజయవాడకు 11:40 గంటలకు చేరుకుంటుంది.
ఇకపై, విజయవాడ నుంచి ఈ రైలు గుడివాడ, భీమవరం మీదుగా ప్రయాణించి నరసాపురం వరకు తన సేవలను అందించనుంది. ఈ పొడిగింపు వల్ల పశ్చిమ గోదావరి జిల్లాలోని నరసాపురం, భీమవరం ప్రాంతాల ప్రజలకు చెన్నై వంటి మెట్రో నగరానికి వేగవంతమైన, ఆధునిక రైలు సౌకర్యం అందుబాటులోకి వచ్చినట్లయింది.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



