Vande Bharat: గుడ్ న్యూస్..త్వరలోనే విజయవాడ-బెంగళూరు మధ్య వందేభారత్ ట్రైన్..!!

Vande Bharat train between Vijayawada-Bengaluru soon
x

Vande Bharat: గుడ్ న్యూస్..త్వరలోనే విజయవాడ-బెంగళూరు మధ్య వందేభారత్ ట్రైన్..!!

Highlights

Vande Bharat: విజయవాడ, బెంగళూరు మధ్య వందేభారత్ ఎక్స్ ప్రెస్ నడిపేందుకు ప్రతిపాదనలు సిద్ధమైనట్లు సమాచారం. ప్రయాణ సమయం 9గంటలుగా రైల్వే శాఖ ప్రాథమికంగా...

Vande Bharat: విజయవాడ, బెంగళూరు మధ్య వందేభారత్ ఎక్స్ ప్రెస్ నడిపేందుకు ప్రతిపాదనలు సిద్ధమైనట్లు సమాచారం. ప్రయాణ సమయం 9గంటలుగా రైల్వే శాఖ ప్రాథమికంగా నిర్ణయించింది. ఇది కార్యరూపం దాల్చినట్లయితే దాదాపు 3గంటల ప్రయాణ సమయం ఆదా అవుతుంది. ఈ రైలు బెంగళూరు వెళ్లేవారితో పాటు తిరుపతి వెళ్లే భక్తులకు ఉపయోగపడుతుంది. మొత్తం 8 బోగీల్లో 7 ఏసీ చైర్ కార్, ఒకటి ఎగ్జిక్యూటివ్ చైర్ కార్.

మంగళవారం మినహా వారానికి 6 రోజులు నడిచే ఈ రైలు విజయవాడలో 5.15 గంటలకు బయలు దేరి తెనాలి, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, కాట్పాడి, క్రిష్ణరాజపురం, ఎస్వీఎంవీటీ బెంగళూరు కు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో అదే రోజు ఈ రైలు బెంగళూరులో 14.45కు గంటలకు ప్రారంభమై క్రిష్ణరాజపురం, కాట్పాడి, చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, ఒంగోలు, తెనాలి, విజయవాడకు చేరుకుంటుంది. ప్రస్తుతం విజయవాడ నుంచి బెంగళూరు వెళ్లేవారికి వారానికి 3 రోజులు నడిచే మచిలీపట్నం నుంయి యశ్వంత్ పూరాకు వెళ్లే కొండవీడు ఎక్స్ ప్రెస్ మాత్రమే అందుబాటులో ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories