Vijayawada: అత్తను దారుణంగా హత్య చేసిన అల్లుడు

Vijayawada: అత్తను దారుణంగా హత్య చేసిన అల్లుడు
x
Highlights

Vijayawada: విజయవాడ సింగ్ నగర్‌లో చోటుచేసుకున్న దారుణ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం రేపింది.

Vijayawada: విజయవాడ సింగ్ నగర్‌లో చోటుచేసుకున్న దారుణ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం రేపింది. భార్యను తనతో కాపురానికి పంపించకపోవడంపై కోపం చెందిన ఒక వ్యక్తి తన అత్తను కత్తితో గాయపరిచి హత్య చేసినట్టు సమాచారం.

సింగ్ నగర్‌కు చెందిన కోలా దుర్గకు నాగసాయి అనే వ్యక్తితో వివాహం జరిగింది. అయితే దంపతుల మధ్య కొంతకాలంగా వాగ్వాదాలు కొనసాగుతున్నాయి. ఈ పరిస్థితే దృష్ట్యా దుర్గ పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో తన భార్యను కాపురానికి పంపించాలని నాగసాయి అత్త కోలా దుర్గను కోరాడు. అంగీకరించకపోవడమే అతడిని తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది.

కోపంతో నాగసాయి అత్త ఇంటికి వెళ్లి, కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో దుర్గకు తీవ్రమైన గాయాలు అయ్యాయి. స్థానికులు వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది.

నాగసాయి స్థానికంగా బట్టల దుకాణంలో పని చేస్తున్నాడని తెలిసింది. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతడిపై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ముందుగానే నాగసాయి పై తన భార్య పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగినట్లు కూడా తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories