YS Jagan on Padayatra: పాదయాత్రపై జగన్ సంచలన ప్రకటన


YS Jagan on Padayatra: పాదయాత్రపై జగన్ సంచలన ప్రకటన
YS Jagan on Padayatra: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మరోసారి పాదయాత్రకు సిద్ధమవుతున్నారనే ఊహాగానాలకు తాజాగా స్పష్టత ఇచ్చారు.
YS Jagan on Padayatra: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మరోసారి పాదయాత్రకు సిద్ధమవుతున్నారనే ఊహాగానాలకు తాజాగా స్పష్టత ఇచ్చారు. మంగళవారం వైసీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన యువజన విభాగం సమావేశంలో ఆయన ఈ అంశాన్ని స్వయంగా ప్రస్తావించారు.
ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ, "ముందుగా జిల్లాల్లో పర్యటనలు జరుగుతాయి. తర్వాత పాదయాత్ర కూడా ఉంటుంది" అని పేర్కొన్నారు.
అంతేకాక, "మనం మళ్లీ మళ్లీ కలుసుకుంటాం. ఇది మనమంతా ఒక్కటవ్వడంలో తొలి అడుగు" అంటూ ఆయన చెప్పారు.
జిల్లాల్లో యువజన నేతలతో కలిసి ఎక్కువగా సమయం గడిపే అవకాశం ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. ఈ వ్యాఖ్యలతో వైఎస్ జగన్ మరోసారి రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేపట్టనున్నారని రాజకీయ వర్గాల్లో చర్చలు మొదలయ్యాయి.
గతంలో చేసిన మహాప్రస్థానంలో జగన్కు వచ్చిన ప్రజా ఆదరణను దృష్టిలో ఉంచుకుని, త్వరలో ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఆయన మళ్లీ ప్రజల్లోకి వెళ్లే వ్యూహాన్ని సిద్ధం చేస్తున్నట్టు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఎన్నికల ముందు పాదయాత్ర చేస్తా.. పాదయాత్ర సమయంలో సోషల్ మీడియా కార్యకర్తలందరిని మళ్లీ కలుస్తా - వైఎస్ జగన్ pic.twitter.com/2PpNNWofYb
— Telugu Scribe (@TeluguScribe) July 1, 2025

About

HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire