
థ్యాంక్యూ ఆల్.. మూడేళ్ల వైసీపీ పాలనపై జగన్ ట్వీట్...
YS Jagan Tweet: 95శాతం ఇచ్చి హామీలు నెరవేర్చగలిగాం : జగన్
YS Jagan Tweet: YCP మూడేళ్ల పాలపై సీఎం జగన్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మూడేళ్లలో ఈ రాష్ట్ర ప్రజలు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నామన్నారు. అందులో భాగంగానే ప్రభుత్వ పథకాలు అమలు చేశామన్న ఆయన.. ప్రజలకు ఇచ్చిన హామీలు 95శాతం అమలుచేశామన్నారు. అలా ఈ మూడేళ్లోల మునుపెన్నడూ ఎరుగని ఎన్నో పనులు పూర్తిచేశామన్నారు.
ప్రజల ఆశీర్వాదాలు ఇలానే ఉంటే రాబోయే రోజుల్లో మరింత సేవ చేస్తామన్నారు. ప్రజా సేవ చేసే సువర్ణావకాశాన్ని కల్పించినందుకు ప్రజలకు మరోసారి కృతజ్ఞతలు చెప్పారు. మూడేళ్ల ప్రభుత్వ పాలనపై జగన్ తన ట్విట్టర్ ఖాతాలు ఇలా రియాక్టర్ అయ్యారు.
మీరు చూపిన ప్రేమ, మీరు అందించిన ఆశీస్సులతో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి మూడేళ్లు అవుతోంది. మీరు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ గడిచిన మూడేళ్లలో 95శాతానికి పైగా హామీలను అమలు చేశాం. ఎన్నో మంచి పనులకు శ్రీకారం చుట్టాం. 1/2
— YS Jagan Mohan Reddy (@ysjagan) May 30, 2022
రాబోయే రోజుల్లో మీకు మరింతగా సేవ చేస్తానని, మీ ప్రేమాభిమానాలు నాపై ఎప్పటికీ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీకు సేవ చేసే భాగ్యాన్ని నాకు కల్పించినందుకు మరొక్కసారి అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. 2/2
— YS Jagan Mohan Reddy (@ysjagan) May 30, 2022

About

HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire