Global Oil Crisis: మండిపోతున్న చమురు ధరలు: హర్ముజ్ జలసంధిని దిగ్బంధించిన ఇరాన్.. భారత్‌కు ఇంధన సెగ!

Global Oil Crisis: మండిపోతున్న చమురు ధరలు: హర్ముజ్ జలసంధిని దిగ్బంధించిన ఇరాన్.. భారత్‌కు ఇంధన సెగ!
x

Global Oil Crisis: మండిపోతున్న చమురు ధరలు: హర్ముజ్ జలసంధిని దిగ్బంధించిన ఇరాన్.. భారత్‌కు ఇంధన సెగ!

Highlights

Global Oil Crisis: పశ్చిమాసియాలో యుద్ధం భీకర రూపం దాల్చడంతో ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరా వ్యవస్థ అతలాకుతలమవుతోంది.

Global Oil Crisis: పశ్చిమాసియాలో యుద్ధం భీకర రూపం దాల్చడంతో ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరా వ్యవస్థ అతలాకుతలమవుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధి (Strait of Hormuz) లో నౌకలను ఇరాన్ అడ్డుకోవడంతో క్రూడాయిల్ ధరలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకాయి. సోమవారం మార్కెట్ ప్రారంభం కాగానే బ్రెంట్ క్రూడ్ ధర ఏకంగా 10 శాతం పెరిగి 81.87 డాలర్లకు చేరింది.

చమురు ట్యాంకర్లే లక్ష్యంగా దాడులు:

ఆదివారం ఇజ్రాయెల్ దాడులకు ప్రతిచర్యగా ఇరాన్ క్షిపణుల వర్షం కురిపించింది. గల్ఫ్ తీరంలో మూడు భారీ చమురు ట్యాంకర్లను దెబ్బతీశామని ఇరాన్ ప్రకటించడంతో ప్రపంచ దేశాల్లో ఆందోళన మొదలైంది. ప్రపంచ చమురు సరఫరాలో 20 శాతం, ఎల్‌ఎన్‌జీలో 20 శాతం వాటా కలిగిన హర్ముజ్ జలసంధి మూతపడటం గ్లోబల్ ఎకానమీకి పెను సవాలుగా మారింది.

భారత్‌పై తీవ్ర ప్రభావం:

ప్రపంచంలోనే మూడో అతిపెద్ద చమురు కొనుగోలుదారు అయిన భారత్‌కు ఇది మింగుడుపడని వార్త. మన దేశం రోజుకు వినియోగించే 5.5 మిలియన్ల బ్యారెళ్లలో సుమారు 2 మిలియన్ బ్యారెళ్లు ఈ జలసంధి నుంచే వస్తాయి.

భారీ భారం: బ్రెంట్ క్రూడ్ ధర కేవలం ఒక డాలర్ పెరిగినా, భారత ప్రభుత్వం ఏడాదికి అదనంగా రూ.13,000 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది.

వ్యూహాత్మక నిల్వలు: ఒకవేళ సరఫరా పూర్తిగా నిలిచిపోతే, భారత్ వద్ద ఉన్న వ్యూహాత్మక నిల్వలు 74 రోజుల పాటు సరిపోతాయని గతంలో కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి స్పష్టం చేశారు.

మార్కెట్ గణాంకాలు:

బ్రెంట్ క్రూడ్ ఏప్రిల్ కాంట్రాక్ట్: 81.87 డాలర్లు (10% పెరుగుదల)

ఫ్యూచర్స్‌లో ధర: 82.37 డాలర్లు (13% పెరుగుదల)

2025 జనవరి తర్వాత ఇదే అత్యధిక స్థాయి.

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఇలాగే కొనసాగితే, భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు గణనీయంగా పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories