
Vodafone Idea: వొడాఫోన్ ఐడియాకు ప్రభుత్వం నుంచి భారీ ఊరట లభించింది. ఈ ఊరటతో రాబోయే రోజుల్లో కంపెనీ షేర్లలో భారీ పెరుగుదల కనిపించవచ్చు.
Vodafone Idea: వొడాఫోన్ ఐడియాకు ప్రభుత్వం నుంచి భారీ ఊరట లభించింది. ఈ ఊరటతో రాబోయే రోజుల్లో కంపెనీ షేర్లలో భారీ పెరుగుదల కనిపించవచ్చు. వాస్తవానికి, స్పెక్ట్రమ్ వేలం బకాయిల బదులుగా రూ. 36,950 కోట్ల విలువైన కొత్త షేర్లను కొనుగోలు చేయడం ద్వారా వొడాఫోన్ ఐడియాలో వాటాను 48.99 శాతానికి పెంచడానికి ప్రభుత్వం అంగీకరించింది. ప్రస్తుతం 22.6 శాతం వాటాతో అప్పుల్లో కూరుకుపోయిన వొడాఫోన్ ఐడియాలో ప్రభుత్వం అతిపెద్ద వాటాదారుగా ఉంది.
వొడాఫోన్ ఐడియా లిమిటెడ్ (VIL) స్టాక్ ఎక్స్ఛేంజ్లకు అందించిన సమాచారంలో ప్రభుత్వం అదనపు వాటా తీసుకోవడం గురించి తెలియజేసింది. ఈ వార్తతో దేశంలోని అతిపెద్ద టెలికాం కంపెనీలైన జియో, ఎయిర్టెల్కు ఇది మింగుడు పడని విషయంగా మారవచ్చు. ఈ రెండు కంపెనీలు తమ స్పెక్ట్రమ్ చెల్లింపులను సకాలంలో పూర్తి చేశాయి, అయితే వొడాఫోన్ ఐడియాకు ఈ విషయంలో ప్రభుత్వం నుంచి ఊరట లభించింది. ఈ విషయంపై గతంలో కూడా ఈ రెండు కంపెనీలు తమ అసంతృప్తిని వ్యక్తం చేశాయి. వొడాఫోన్ ఐడియా ఏమి చెప్పిందో ఇప్పుడు చూద్దాం.
వొడాఫోన్ ఐడియాకు రూ. 36,950 కోట్ల ఊరట
టెలికాం రంగం కోసం 2021 సెప్టెంబర్లో ప్రకటించిన సంస్కరణలు, సహాయక ప్యాకేజీకి అనుగుణంగా, స్పెక్ట్రమ్ వేలం బకాయి మొత్తాన్ని, మారటోరియం ముగిసిన తర్వాత చెల్లించాల్సిన వాయిదాలతో సహా, కమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వానికి జారీ చేయాల్సిన ఈక్విటీ షేర్లుగా మార్చాలని నిర్ణయించిందని కంపెనీ తెలిపింది.
ఈక్విటీ షేర్లుగా మార్చాల్సిన మొత్తం రూ. 36,950 కోట్లు. భారతీయ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ (SEBI), ఇతర అధికారుల నుంచి అవసరమైన ఆదేశాలు జారీ చేసిన 30 రోజుల్లోపు రూ. 10 ముఖ విలువ కలిగిన 3,695 కోట్ల ఈక్విటీ షేర్లను ఒక్కో షేరుకు రూ. 10 ఇష్యూ ధర వద్ద జారీ చేయాలని వొడాఫోన్ ఐడియాకు ఆదేశాలు అందాయి.
దాదాపు 49 శాతం వాటా
కొత్త ఈక్విటీ షేర్లు జారీ చేసిన తర్వాత కంపెనీలో భారత ప్రభుత్వ వాటా ప్రస్తుత 22.60 శాతం నుంచి దాదాపు 48.99 శాతానికి పెరుగుతుందని కంపెనీ స్టాక్ ఎక్స్ఛేంజ్లకు తెలిపింది. అయితే కంపెనీ కార్యకలాపాల నియంత్రణ తమ ప్రమోటర్ల వద్దనే ఉంటుందని వొడాఫోన్ ఐడియా స్పష్టం చేసింది. అప్పుల్లో కూరుకుపోయిన ఈ టెలికాం కంపెనీ స్పెక్ట్రమ్ వేలం సొమ్మును ప్రభుత్వానికి చెల్లించలేకపోయింది. దీంతో బకాయిల బదులుగా 22.6 శాతం వాటాను ప్రభుత్వానికి అప్పగించింది.
షేర్లలో పెరుగుదల కనిపించవచ్చు
ప్రభుత్వం నుంచి లభించిన ఈ ఊరటతో వొడాఫోన్ ఐడియా 5Gలో పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది. అలాగే మంగళవారం నుంచి కంపెనీ షేర్లలో పెరుగుదల కనిపించవచ్చు. గణాంకాల ప్రకారం శుక్రవారం కంపెనీ షేర్లు 1.73 శాతం క్షీణించి రూ. 6.81 వద్ద ముగిశాయి. ట్రేడింగ్ సెషన్లో వొడాఫోన్ ఐడియా షేర్లు రూ. 6.77 కనిష్ట స్థాయికి చేరుకున్నాయి. ప్రస్తుతం కంపెనీ మార్కెట్ క్యాప్ రూ. 48,618.66 కోట్లకు చేరుకుంది.

About

HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire