జియో బాటలో ఎయిర్‌టెల్‌.. 1జీబీ ప్లాన్‌కు ముగింపు

జియో బాటలో ఎయిర్‌టెల్‌.. 1జీబీ ప్లాన్‌కు ముగింపు
x

జియో బాటలో ఎయిర్‌టెల్‌.. 1జీబీ ప్లాన్‌కు ముగింపు

Highlights

టెలికాం రంగంలో మరోసారి మార్పులు చోటుచేసుకున్నాయి. తాజాగా ఎయిర్‌టెల్ వినియోగదారులకు షాక్ ఇచ్చింది. ఇప్పటివరకు అందిస్తున్న ₹249 ఎంట్రీ లెవల్‌ ప్రీపెయిడ్‌ ప్లాన్‌ను నిలిపివేసింది. ఈ నిర్ణయం ఆగస్టు 20 నుంచి అమల్లోకి రానుంది.

టెలికాం రంగంలో మరోసారి మార్పులు చోటుచేసుకున్నాయి. తాజాగా ఎయిర్‌టెల్ వినియోగదారులకు షాక్ ఇచ్చింది. ఇప్పటివరకు అందిస్తున్న ₹249 ఎంట్రీ లెవల్‌ ప్రీపెయిడ్‌ ప్లాన్‌ను నిలిపివేసింది. ఈ నిర్ణయం ఆగస్టు 20 నుంచి అమల్లోకి రానుంది.

అదే తరహాలో కొద్దిసేపటి క్రితమే జియో కూడా 1జీబీ ఎంట్రీ లెవల్‌ ప్లాన్‌ను నిలిపివేయడం గమనార్హం. దీంతో వొడాఫోన్‌-ఐడియా కూడా ఇలాంటి నిర్ణయం తీసుకునే అవకాశముందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఇకపై ₹319 నుంచి మాత్రమే

ప్రస్తుతం ఎయిర్‌టెల్ యూజర్లు 24 రోజులకు 1జీబీ డేటా + అపరిమిత కాల్స్ ప్లాన్‌ను ఉపయోగిస్తున్నారు. అయితే ఇకపై కనీసం ₹319 రీఛార్జ్ తప్పనిసరి కానుంది. ఈ ప్యాక్ 30 రోజుల వ్యాలిడిటీతో అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం వొడాఫోన్‌ ఐడియా మాత్రం 1జీబీ/రోజు ప్లాన్‌ను ₹299కి ఇస్తోంది.

జియో తొలగింపు ఎలా జరిగింది?

జియో మొదటగా 28 రోజులకు 1జీబీ/రోజు ప్లాన్‌ను తీసేసింది. ఇకపై 1.5జీబీ/రోజు లేదా 2జీబీ/రోజు ప్లాన్‌లే యూజర్లకు లభ్యం అవుతాయి. ఇప్పటికే ఈ మార్పు అమల్లోకి వచ్చి, జియో వెబ్‌సైట్‌లో పాత 1జీబీ ప్లాన్ పూర్తిగా తొలగించబడింది.

28 రోజులకు ₹299 – 1.5 జీబీ/రోజు

28 రోజులకు ₹349 – 2 జీబీ/రోజు

ఎందుకు తీసేశారు? – ARPU లక్ష్యం

టెలికాం నిపుణుల అంచనా ప్రకారం, ఈ మార్పుల వెనుక ప్రధాన కారణం ARPU (Average Revenue Per User) పెంపు.

జియో యూజర్లలో 20–25% మంది,

ఎయిర్‌టెల్ యూజర్లలో 18–20% మంది

1జీబీ ప్లాన్ వాడుతున్నారని చెబుతున్నారు.

ఇవి రద్దయిన తర్వాత యూజర్లు తప్పనిసరిగా అధిక ధర ప్లాన్‌లు ఎంచుకోవాల్సి వస్తుంది. దీంతో టెలికాం కంపెనీల ఆదాయాలు 4–7% పెరిగే అవకాశం, అలాగే యూజర్‌కు సగటు ఆదాయం ₹10–13 వరకు పెరగనుందని బ్రోకరేజీ సంస్థల అంచనా.

Show Full Article
Print Article
Next Story
More Stories