
జియో బాటలో ఎయిర్టెల్.. 1జీబీ ప్లాన్కు ముగింపు
టెలికాం రంగంలో మరోసారి మార్పులు చోటుచేసుకున్నాయి. తాజాగా ఎయిర్టెల్ వినియోగదారులకు షాక్ ఇచ్చింది. ఇప్పటివరకు అందిస్తున్న ₹249 ఎంట్రీ లెవల్ ప్రీపెయిడ్ ప్లాన్ను నిలిపివేసింది. ఈ నిర్ణయం ఆగస్టు 20 నుంచి అమల్లోకి రానుంది.
టెలికాం రంగంలో మరోసారి మార్పులు చోటుచేసుకున్నాయి. తాజాగా ఎయిర్టెల్ వినియోగదారులకు షాక్ ఇచ్చింది. ఇప్పటివరకు అందిస్తున్న ₹249 ఎంట్రీ లెవల్ ప్రీపెయిడ్ ప్లాన్ను నిలిపివేసింది. ఈ నిర్ణయం ఆగస్టు 20 నుంచి అమల్లోకి రానుంది.
అదే తరహాలో కొద్దిసేపటి క్రితమే జియో కూడా 1జీబీ ఎంట్రీ లెవల్ ప్లాన్ను నిలిపివేయడం గమనార్హం. దీంతో వొడాఫోన్-ఐడియా కూడా ఇలాంటి నిర్ణయం తీసుకునే అవకాశముందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఇకపై ₹319 నుంచి మాత్రమే
ప్రస్తుతం ఎయిర్టెల్ యూజర్లు 24 రోజులకు 1జీబీ డేటా + అపరిమిత కాల్స్ ప్లాన్ను ఉపయోగిస్తున్నారు. అయితే ఇకపై కనీసం ₹319 రీఛార్జ్ తప్పనిసరి కానుంది. ఈ ప్యాక్ 30 రోజుల వ్యాలిడిటీతో అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం వొడాఫోన్ ఐడియా మాత్రం 1జీబీ/రోజు ప్లాన్ను ₹299కి ఇస్తోంది.
జియో తొలగింపు ఎలా జరిగింది?
జియో మొదటగా 28 రోజులకు 1జీబీ/రోజు ప్లాన్ను తీసేసింది. ఇకపై 1.5జీబీ/రోజు లేదా 2జీబీ/రోజు ప్లాన్లే యూజర్లకు లభ్యం అవుతాయి. ఇప్పటికే ఈ మార్పు అమల్లోకి వచ్చి, జియో వెబ్సైట్లో పాత 1జీబీ ప్లాన్ పూర్తిగా తొలగించబడింది.
28 రోజులకు ₹299 – 1.5 జీబీ/రోజు
28 రోజులకు ₹349 – 2 జీబీ/రోజు
ఎందుకు తీసేశారు? – ARPU లక్ష్యం
టెలికాం నిపుణుల అంచనా ప్రకారం, ఈ మార్పుల వెనుక ప్రధాన కారణం ARPU (Average Revenue Per User) పెంపు.
జియో యూజర్లలో 20–25% మంది,
ఎయిర్టెల్ యూజర్లలో 18–20% మంది
1జీబీ ప్లాన్ వాడుతున్నారని చెబుతున్నారు.
ఇవి రద్దయిన తర్వాత యూజర్లు తప్పనిసరిగా అధిక ధర ప్లాన్లు ఎంచుకోవాల్సి వస్తుంది. దీంతో టెలికాం కంపెనీల ఆదాయాలు 4–7% పెరిగే అవకాశం, అలాగే యూజర్కు సగటు ఆదాయం ₹10–13 వరకు పెరగనుందని బ్రోకరేజీ సంస్థల అంచనా.

About

HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire