
LPG supply India
LPG supply India: మధ్యప్రాచ్య ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్లో వంట గ్యాస్ కొరత రాకుండా ఎల్పీజీ ఉత్పత్తిని పెంచాలని కేంద్రం రిఫైనరీలను ఆదేశించింది.
LPG supply India:మధ్యప్రాచ్యంలో ఇరాన్ - ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం నేపథ్యంలో, భారతదేశంలో వంట గ్యాస్ కొరత ఏర్పడకుండా కేంద్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. దేశంలోని అన్ని ఆయిల్ రిఫైనరీల వద్ద అత్యవసరంగా ఎల్పీజీ ఉత్పత్తిని పెంచాలని గురువారం రాత్రి కేంద్రం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. అంతర్జాతీయంగా సప్లై చైన్ దెబ్బతినే అవకాశం ఉన్నందున, దేశీయ వినియోగదారులకు ఇబ్బంది కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు.
రాయిటర్స్ రిపోర్ట్స్ ప్రకారం, మధ్యప్రాచ్య దేశాల్లో పెరుగుతున్న యుద్ధ మేఘాలు ప్రపంచ ఇంధన మార్కెట్పై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తనకున్న ప్రత్యేక అధికారాలను ఉపయోగించి రిఫైనరీ కంపెనీలకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఇకపై కంపెనీల వద్ద అందుబాటులో ఉన్న ప్రొపేన్ , బ్యూటేన్లను కేవలం వంట గ్యాస్ ఉత్పత్తికే కేటాయించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
LPG supply India: సాధారణంగా ఈ వాయువులను వివిధ పారిశ్రామిక అవసరాల కోసం కూడా ఉపయోగిస్తుంటారు. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో వీటిని మరే ఇతర అవసరాలకు వాడకూడదని, కేవలం ఎల్పీజీ తయారీకే ప్రాధాన్యత ఇవ్వాలని ఆర్డర్లో పేర్కొన్నారు. దీనివల్ల దేశంలోని దాదాపు 33.2 కోట్ల గ్యాస్ కనెక్షన్లకు ఎటువంటి అంతరాయం కలగకుండా సిలిండర్లను సరఫరా చేయవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.
హార్ముజ్ జలసంధి వంటి కీలక సరఫరా మార్గాల్లో అడ్డంకులు ఏర్పడినా తట్టుకునేలా భారత్ తగినన్ని ఇంధన నిల్వలను కలిగి ఉందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ముడి చమురు, పెట్రోలియం ఉత్పత్తులు, ఎల్పీజీ నిల్వలు ప్రస్తుతం ఆశాజనకంగా ఉన్నాయని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు భరోసా ఇస్తున్నారు. ఇతర ప్రపంచ దేశాల నుండి కూడా సరఫరాలను పెంచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
భారతదేశం తన చమురు అవసరాల కోసం గత కొన్నేళ్లుగా రష్యాపై ఆధారపడటం పెంచింది. 2022లో రష్యా నుండి కేవలం 0.2 శాతం ముడి చమురును మాత్రమే దిగుమతి చేసుకున్న భారత్, ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి ఆ వాటాను 20 శాతానికి పెంచుకుంది. ప్రస్తుతం ప్రతిరోజూ రష్యా నుండి దాదాపు 10.4 లక్షల బ్యారెళ్ల ముడి చమురును భారత్ దిగుమతి చేసుకుంటోంది. ఇది మధ్యప్రాచ్య సంక్షోభం సమయంలో భారత్కు రక్షణ కవచంలా మారుతోంది.
LPG supply India: ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఎల్పీజీ దిగుమతిదారుగా ఉన్న భారత్, దేశీయ శుద్ధి కర్మాగారాల సామర్థ్యంపై పూర్తి నమ్మకంతో ఉంది. ఇటీవల ఎంఆర్పీఎల్ (MRPL) రిఫైనరీ మూసివేతపై వస్తున్న వార్తల్లో నిజం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. అక్కడ తగినంత చమురు నిల్వలు ఉన్నాయని వెల్లడించింది. ప్రైవేట్ కంపెనీలు కూడా తమ వద్ద ఉన్న నిల్వలను ప్రభుత్వ రంగ సంస్థలైన IOC, HPCL మరియు BPCL లకు సరఫరా చేయాలని ఆదేశించింది.
ముందస్తుగా తీసుకున్న ఈ నిర్ణయాల వల్ల అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగినప్పటికీ, దేశీయంగా గ్యాస్ సిలిండర్ల లభ్యతపై ప్రభావం పడకుండా ప్రభుత్వం జాగ్రత్త పడుతోంది. పారిశ్రామిక అవసరాల కంటే సామాన్యుల వంట గ్యాస్ అవసరాలకే ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత ఇస్తోంది.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




