
RBI : భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) ఆర్థిక సంవత్సరం 2024-25లో ఇప్పటివరకు మొత్తం 57.5 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసింది. దీంతో దేశంలోని మొత్తం పసిడి...
RBI : భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) ఆర్థిక సంవత్సరం 2024-25లో ఇప్పటివరకు మొత్తం 57.5 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసింది. దీంతో దేశంలోని మొత్తం పసిడి నిల్వలు 879.6 టన్నులకు చేరుకున్నాయి. గత ఏడేళ్లలో ఇది రెండో అతిపెద్ద వార్షిక కొనుగోలుగా భావిస్తున్నారు. బంగారాన్ని ఎల్లప్పుడూ సురక్షితమైన పెట్టుబడి సాధనంగా పరిగణిస్తారు. సామాన్యులతో పాటు ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ కూడా తన బంగారు నిల్వలను పెంచుకుంటోంది. దీని వెనుక ఆర్బీఐ వ్యూహం ఏమిటంటే.. తన విదేశీ మారక నిల్వలను వైవిధ్యపరచడం ద్వారా ప్రమాదాల నుండి రక్షించుకోవడం.
ఆర్బీఐ పదే పదే బంగారం ఎందుకు కొంటోంది?
ప్రపంచ ఆర్థిక అనిశ్చితులు, డాలర్ అస్థిరతను దృష్టిలో ఉంచుకుని RBI ఈ కొనుగోలు చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా అనేక కేంద్ర బ్యాంకులు అమెరికన్ డాలర్ అస్థిరత్వం, పాశ్చాత్య ఆర్థిక వ్యవస్థల ఒత్తిడి కారణంగా తమ నిల్వలలో బంగారం వాటాను పెంచుతున్నాయి. తమ నిల్వలను బలోపేతం చేయడానికి, సమతుల్యం చేయడానికి భారత్ కూడా ఈ దిశలో అడుగులు వేస్తోంది.
ఎప్పుడెప్పుడు కొనుగోలు చేసింది?
ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం, భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) ఇప్పటివరకు అత్యధికంగా బంగారాన్ని ఆర్థిక సంవత్సరం 2021-22లో కొనుగోలు చేసింది. ఆ సమయంలో మొత్తం 66 టన్నుల బంగారం నిల్వలకు చేరింది. ఆ తర్వాత 2022-23లో 35 టన్నులు, 2023-24లో 27 టన్నుల బంగారం కొనుగోలు చేశారు.
ఆర్థిక సంవత్సరం 2024-25లో కూడా బంగారం కొనుగోలు వేగం పుంజుకుంది. ఈ ట్రెండ్కు ప్రపంచ స్థాయిలో పెరుగుతున్న అనిశ్చితి, డాలర్ అస్థిరత్వం ప్రధాన కారణాలుగా భావిస్తున్నారు. నవంబర్ 2024లో డొనాల్డ్ ట్రంప్ మళ్లీ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత డాలర్లో నిరంతరం హెచ్చుతగ్గులు కనిపించాయి. దీంతో మదుపర్ల దృష్టి మళ్లీ సురక్షితమైన పెట్టుబడి ఎంపికగా భావించే బంగారం వైపు మళ్లింది. RBI ఈ వ్యూహం భారతదేశ విదేశీ మారక నిల్వలను వైవిధ్యపరచడానికి , ప్రపంచ ప్రమాదాల నుండి రక్షించడానికి చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తున్నారు.
భారతదేశ బంగారం ఎక్కడ ఉంది?
దేశంలోని అధిక భాగం స్వర్ణ నిల్వలు ఇంగ్లాండ్, ఇతర విదేశీ బ్యాంకుల్లో ఉంచారు. 2024 మొదటి త్రైమాసికంలో అత్యధికంగా బంగారం కొనుగోలు చేసిన అగ్ర దేశాలలో భారత్ కూడా ఉంది. ప్రపంచ మార్కెట్లో బంగారం ధరలు పెరుగుతున్నప్పటికీ ఈ చర్య తీసుకున్నారు.
ఆపదలో ఎలా ఉపయోగపడుతుంది?
RBI ఈ విధానం ఆర్థిక స్థిరత్వాన్ని పెంచడమే కాకుండా అంతర్జాతీయ లావాదేవీలు, విదేశీ రుణాల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుందని నిపుణులు భావిస్తున్నారు. అంతేకాకుండా, ఇది ప్రపంచ స్థాయిలో భారతీయ రూపాయిని బలోపేతం చేసే దిశగా ఒక ముఖ్యమైన వ్యూహాత్మక ప్రయత్నంగా కూడా పరిగణిస్తున్నారు. మొత్తంమీద, RBI ఇంత పెద్ద మొత్తంలో బంగారం కొనుగోలు చేయడం భారతదేశ దీర్ఘకాలిక ఆర్థిక వ్యూహంలో భాగంగా చూడవచ్చు. దీని లక్ష్యం ప్రపంచ ఆర్థిక అస్థిరత నుంచి దేశ ఆర్థిక వ్యవస్థను రక్షించడం, విదేశీ మారక నిల్వలను సమతుల్యంగా ఉంచడం

About

HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire