Credit Card: ఎమ్‌డీఆర్ ఛార్జ్ అంటే ఏమిటి? క్రెడిట్ కార్డు పేమెంట్ చేసే వారికి షాక్!

Credit Card
x

Credit Card: ఎమ్‌డీఆర్ ఛార్జ్ అంటే ఏమిటి? క్రెడిట్ కార్డు పేమెంట్ చేసే వారికి షాక్!

Highlights

Credit Card: పేమెంట్ చేసేటప్పుడు క్రెడిట్ కార్డు హోల్డర్స్ చాలా విషయాలు గుర్తుంచుకోవాలి.

Credit Card: పేమెంట్ చేసేటప్పుడు క్రెడిట్ కార్డు హోల్డర్స్ చాలా విషయాలు గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం ఒక కొత్త ప్లాన్‌ను తీసుకొస్తోంది. దాని ప్రకారం క్రెడిట్ కార్డుకు బదులుగా యూపీఐ ద్వారా పేమెంట్ చేసే వారికి తక్కువ ధర చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ ప్లాన్ అమల్లోకి వస్తే యూపీఐ ద్వారా పేమెంట్ చేసే వారి సంఖ్య పెరుగుతుంది. కానీ క్రెడిట్ కార్డు వాడే వారిపై దీని ప్రభావం పడవచ్చు. అసలు ఎమ్‌డీఆర్ ఛార్జ్ అంటే ఏంటో తెలుసా ? పేమెంట్ చేసినప్పుడు షాపువాళ్లు మీ జేబు ఎలా ఖాళీ చేస్తారో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

2 నుంచి 3 శాతం వరకు ఛార్జ్

క్రెడిట్ కార్డుతో పేమెంట్ చేసినప్పుడు దానిపై 2 నుంచి 3 శాతం వరకు ఛార్జ్ పడుతుంది. దాన్నే మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎమ్‌డీఆర్) అంటారు. కానీ యూపీఐ ద్వారా పేమెంట్ చేస్తే ఈ ఛార్జ్ ఉండదు. మీరు ఒక షాపులో క్రెడిట్ కార్డుతో పేమెంట్ చేసినప్పుడు 2 నుంచి 3 శాతం వరకు మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎమ్‌డీఆర్) ఛార్జీని మీరు చెల్లించాలి. అయితే కొంతమంది షాపు యజమానులు ఈ ఛార్జీని తమ జేబులోంచి ఇస్తారు. కానీ చాలా మంది షాపు యజమానులు మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎమ్‌డీఆర్) భారాన్ని తమ కస్టమర్లపై వేస్తారు. క్రెడిట్ కార్డుతో పేమెంట్ చేస్తే 2 నుంచి 3 శాతం వరకు అదనంగా చెల్లించాల్సి ఉంటుందని వారికి చెబుతారు. ఎక్కువ కొనుగోలు చేస్తే ఈ ఛార్జ్ కూడా పెరుగుతుంది.

యూపీఐ పేమెంట్స్‌కు పెరుగుతున్న ఆసక్తి

దీని వల్ల యూపీఐ ద్వారా పేమెంట్ చేసే వారి సంఖ్య పెరుగుతుంది. అంతేకాదు, యూపీఐ ద్వారా ట్రాన్సాక్షన్ చేయడానికి తక్కువ సమయం పడుతుంది. ప్రస్తుతం యూపీఐ ద్వారా పేమెంట్ చేయడానికి 30 సెకన్లు పడుతుండగా, ఇకపై కేవలం 15 సెకన్లలోనే పూర్తవుతుంది. అంటే పేమెంట్ చేసిన వెంటనే మీ డబ్బు షాపు యజమాని అకౌంట్‌కు చేరుకుంటుంది. ఇప్పుడు యూపీఐ పేమెంట్ మరింత సురక్షితం కానుంది. ఎన్‌పీసీఐ పీ2పీఎమ్ లావాదేవీలను జూన్ 30 నాటికి అమలు చేయనుంది. ఈ ఫీచర్ వచ్చిన తర్వాత ఎవరికి డబ్బు పంపుతున్నారో తెలుసుకోవచ్చు.

Show Full Article
Print Article
Next Story
More Stories