
Dwarapudi crime
Dwarapudi crime: ద్వారపూడిలో ప్రేమ వివాహం చేసుకున్న సూర్యప్రకాశ్ ను యువతి కుటుంబ సభ్యులు రాళ్లతో దాడి చేసి హత్య చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
Dwarapudi crime: ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు వ్యక్తిని కొట్టి చంపిన ఘటన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. పరువు హత్యగా భావిస్తున్న ఈ ఘటన ద్వారపూడి గ్రామంలో చోటు చేసుకుంది. రెండేళ్లుగా ప్రేమించుకుంటున్న పోలిపల్లి సూర్యప్రకాశ్ (41), ఆయనవిల్లి సంధ్య (40) గురువారం (26.02.2026) అన్నవరంలో పెళ్లి చేసుకున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలో కొంతమంది అదేరోజు రాత్రి సమయంలో సూర్యప్రకాశ్ పై దాడి చేసి తీవ్రంగా కొట్టారని, దీంతో ఆయన అక్కడికక్కడే మరణించారని స్థానికులు అంటున్నారు.
ఈ విషయంపై పోలీసులు అందించిన సమాచారం ప్రకారం ఆయనవిల్లి సంధ్య (40), ప్రస్తుతం రాయవరం డిప్యూటీ తహసీల్దార్గా పనిచేస్తున్నారు. సూర్యప్రకాశ్ తెనుకుల వర్గానికి చెందినవారు. సంధ్య గౌడ వర్గానికి చెందినవారు. గత రెండు సంవత్సరాలుగా ఇద్దరూ పరస్పరం ప్రేమించుకుంటున్నట్లు తెలిసింది. కుటుంబ సభ్యుల అభ్యంతరాల మధ్య నిన్న (26-02-2026) అన్నవరం దేవస్థానంలో వివాహం చేసుకున్నట్లు సమాచారం.
Dwarapudi crime: వివాహ విషయం తెలిసిన తర్వాత సంధ్య కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. గురువారం రాత్రి సుమారు 11:30 గంటల సమయంలో సూర్యప్రకాశ్ ఇంటికి వెళ్లిన కొందరు వ్యక్తులు రాళ్లతో దాడి చేసినట్లు స్థానికులు ఆరోపించారు. ఈ దాడిలో సూర్యప్రకాశ్ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు ఆసుపత్రికి తరలించేలోపే ఆయన మృతి చెందినట్లు సమాచారం. ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది.
Dwarapudi crime:సమాచారం అందుకున్న వెంటనే మండపేట రూరల్ ఎస్సై వి. కిషోర్, సీఐ పి. దొరరాజు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఈస్ట్ జోన్ డిఎస్పీ విద్య కూడా ఘటనాస్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. దాడిలో పాల్గొన్న వారిపై చర్యలు తీసుకునే దిశగా ఆధారాలు సేకరిస్తున్నారు. పూర్తి వివరాలు దర్యాప్తులో వెలుగులోకి రానున్నాయని అధికారులు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్లో గతంలో కూడా పరువు హత్యలకు సంబంధించిన ఘటనలు వెలుగులోకి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. కుటుంబ గౌరవం పేరుతో జరిగే ఈ తరహా హింసాత్మక చర్యలు చట్టపరంగా తీవ్రమైన నేరాలు. పోలీసులు ఇటువంటి కేసుల్లో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు.
సమాజంలో అంతర్వివాహాలపై ఇంకా కొన్ని వర్గాల్లో వ్యతిరేక భావాలు ఉన్నప్పటికీ, చట్టపరంగా ఇద్దరు పెద్దలు స్వేచ్ఛగా వివాహం చేసుకోవడానికి హక్కు ఉంది. ఈ నేపథ్యంలో ద్వారపూడి ఘటన సామాజికంగా కూడా చర్చకు దారి తీసింది. ప్రస్తుతం గ్రామంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసి శాంతి భద్రతలు కట్టుదిట్టం చేశారు. పరిస్థితి అదుపులోనే ఉన్నట్లు అధికారులు తెలిపారు.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




