Indus River Treaty: 'సింధులో పారేది నీళ్లు కాదు.. వారి రక్తం..' కామెడీ ఆపు పాక్‌ బ్రో..!

Indus River Treaty: సింధులో పారేది నీళ్లు కాదు.. వారి రక్తం.. కామెడీ ఆపు పాక్‌ బ్రో..!
x
Highlights

Indus River Treaty: జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత, ఉగ్రవాదానికి ఆశ్రయం కల్పిస్తున్న పాకిస్తాన్‌పై భారతదేశం ఒకదాని తర్వాత...

Indus River Treaty: జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత, ఉగ్రవాదానికి ఆశ్రయం కల్పిస్తున్న పాకిస్తాన్‌పై భారతదేశం ఒకదాని తర్వాత ఒకటి కఠిన చర్యలు తీసుకుంది. పహల్గామ్ ఉగ్రవాద దాడిలో 26 మంది మరణించారు. ఉగ్రవాదులు పర్యాటకులను వారి మతం గురించి అడిగారు. తరువాత వారిపై కాల్పులు జరిపారు. ఈ సంఘటన తర్వాత, పాకిస్తాన్‌తో సింధు నది ఒప్పందాన్ని నిలిపివేయడంతో సహా భారతదేశం అనేక కఠినమైన నిర్ణయాలు తీసుకుంది. భారతదేశం ఈ చర్యతో పాకిస్తాన్ ఉలిక్కిపడింది. ఆ దేశ నాయకులు నిరంతరం బెదిరింపులు జారీ చేస్తున్నారు. ఇప్పుడు బెదిరింపులు చేసే నాయకులలో కొత్త పేరు బయటపడింది.అది బిలావల్ భుట్టో. బిలావల్ సింధు నదిలో భారత ప్రజల రక్తాన్ని ప్రవహించాలంటూ వ్యాఖ్యలు చేశారు.

పాకిస్తాన్ రాజకీయ నాయకుడు బిలావల్ భుట్టో భారతదేశానికి బహిరంగ బెదిరింపు ఇచ్చారు. "ఇప్పుడు సింధు నదిలో నీళ్లు ప్రవహిస్తాయి, లేదా వారి రక్తం ప్రవహిస్తుంది. సింధు నది మనదే అవుతుంది" అని బిలావల్ అన్నారు. బిలావల్ భుట్టో పలు వ్యాఖ్యలతోగతంలో చాలాసార్లు వార్తల్లో నిలిచారు. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని అరికట్టే వరకు, దాని పట్ల ఎటువంటి దయ చూపబోమని ఇక్కడ భారత ప్రభుత్వం స్పష్టం చేసింది.

బిలావల్ భుట్టో పాకిస్తాన్ రాజకీయ పార్టీ పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (PPP) ప్రస్తుత అధ్యక్షుడు. ఆయన తల్లి బెనజీర్ భుట్టో పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి. బిలావల్ తండ్రి ఆసిఫ్ అలీ జర్దారీ ప్రస్తుతం పాకిస్తాన్ అధ్యక్షుడిగా ఉన్నారు. బిలావల్ ప్రస్తుతం పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీ సభ్యుడు. ఆయన గతంలో పాకిస్తాన్ విదేశాంగ మంత్రి పదవిని కూడా నిర్వహించారు. బిలావల్ తల్లి బెనజీర్ భుట్టో ఉగ్రవాద దాడిలో మరణించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories