Iran Israel War: ఇరాన్పై ఇజ్రాయిల్ మిస్సైల్ దాడులు.. దిక్కుతోచని స్థితిలో అక్కడ చదువుతున్న భారత్ విద్యార్దులు


Iran Israel War: ఇరాన్పై ఇజ్రాయిల్ మిస్సైల్ దాడులు.. దిక్కుతోచని స్థితిలో అక్కడ చదువుతున్న భారత్ విద్యార్దులు
Iran Israel War: గతకొన్ని రోజులుగా ఇరార్, ఇజ్రాయిల్ దేశాల మధ్య భీకర యుద్ధం నడుస్తోంది. ఈ రెండు దేశాలు మిస్సైల్ దాడులతో సమాధానాలు చెప్పుకుంటున్నాయి.
Iran Israel War: గతకొన్ని రోజులుగా ఇరార్, ఇజ్రాయిల్ దేశాల మధ్య భీకర యుద్ధం నడుస్తోంది. ఈ రెండు దేశాలు మిస్సైల్ దాడులతో సమాధానాలు చెప్పుకుంటున్నాయి. ఈ దాడులతో పశ్చిమాసియా మొత్తం అల్లకల్లోలంగా మారింది. ముఖ్యంగా ఇరాన్లో మెడిసిన్ చదువుతున్న వేల మంది మన విద్యార్దుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
కన్నవాళ్లని వదలి ఊరి కాని ఊరిలో చదవడం ఒక ఎత్తయితే ఇప్పుడు అక్కడ మిస్సైల్ దాడులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. దీంతో అక్కడ మెడిసిన చదువుతున్న భారతీయ విద్యార్దులు ఏం చేయాలో తెలియని పరిస్థితులో ఉండిపోయారు. ప్రతి సంవత్సరం మన దేశం నుంచి 25వేల మంది వరకు మెడిసిన్ చదవడానికి విదేశాలకు వెళ్తుంటారు. అమెరికా, కెనడా, లండన్ ఇలాంటి దేశాలకే కాదు ఇరాన్, ఫిలిప్పిన్స్ వంటి దేశాలు కూడా వెళ్లి అక్కడ మెడిసిన్ పూర్తిచేస్తారు.
2022 లెక్కల ప్రకారం ఇరాన్ లో ఇప్పుడు 2వేల మంది వరకు భారతీయ విద్యార్దులు అక్కడ మెడిసిన్ చదువుతున్నారు. అయితే ఇప్పుడు వీరంతా ఏం చేయాలి అనేదానిపై ఎటువంటి స్పష్టత లేదు. అక్కడ యుద్ధం ఇంకా ఎక్కువ తీవ్రతరం లేనందున భారత్ ప్రభుత్వం వీరి గురించి ఆలోచించడంలేదనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే గతంలో కూడా ఒకసారి ఇలా జరిగినప్పుడు అక్కడ చదువుతున్న భారతీయ విద్యార్దులందరినీ భారత ప్రభుత్వం ఇండియాకు సేఫ్గా తీసుకొచ్చింది. ఇప్పుడు కూడా అదే జరగొచ్చని అందరు భావిస్తున్నారు.
విదేశాల్లో మెడిసిన్కి ఎందుకంత క్రేజ్
భారతదేశంలో మెడిసిన్కు చాలా పోటీ ఉంటుంది. ఎందుకంటే మెడిసిన్ చేయాలనుకునేవారు ఎంట్రెన్స్ ఎగ్జామ్స్లో సెలెక్ట్ అవడం అంత ఈజీకాదు. లక్షల సంఖ్యలో నీట్ పరీక్షలు రాస్తారు. వీరందరికీ ఇక్కడ సీట్ దొరకదు. కాబట్టి విదేశాల్లో మెడిసిన్ చదివేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ ఏడాడి దాదాపు 23 లక్షల మంది నీట్ పరీక్ష రాసారు. అయితే దేశంలో ఉన్న మెడిసిన్ సీట్లు మాత్రం కేవలం 1.1 లక్షలే. ఇందులో ప్రభుత్వ కాలేజీల్లో 55వేలు సీట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఇక ప్రయివేటు కాలేజీల విషయానికొస్తే సామాన్యుడు ఈ ఫీజులు కట్టలేడు. దీనివల్ల ఇండిఆయ కంటే ఇతర దేశాలు బెస్ట్ అని విదేశాల్లో మెడిసిన్ చదివేందుకు మన విద్యార్దులు ఇష్టపడుతున్నారు.
ఇరాన్ విషయానికొస్తే ఏటా వేల మంది ఇరాన్లో ఉన్న టెహ్రాన్, షాహిద్ బహెష్తి, హమదాన్, గోలెస్థాన్, ఇస్లామిక్ ఆజాద్, కెర్మన్ వంటి మెడిసిన్ యూనివర్శిటీలో సీట్లు పొందుతున్నారు. ఎందుకంటే అక్కడ పోటీ తక్కువ. అందుకే అక్కడవాళ్లు విదేశీ విద్యార్దులను చేర్చుకోడానికి ఆసక్తి చూపుతారు. పైగా అక్కడ మెడిసిన్ చేయాలంటే చాలా తక్కువ ఖర్చు. మన దేశంలో వైద్య విద్య ఒక ప్రయివేట్ కాలేజీలో చేయాలంటే రూ. 50 లక్షలకు పైనే ఖర్చు అవుతుంది. అదే బంగ్లాదేశ్లో చేయాలంటే రూ. 40 లక్షల వరకు అవుతుంది. అదే ఇరాన్లో చేయాలంటే రూ. 14 నుంచి రూ. 15 లక్షలు మాత్రమే ఖర్చు అవుతుంది.
అంతేకాదు విదేశీ విద్యార్దులకు ఆకర్షించేందుకు ఇరాన్ యూనివర్శిటీలు స్కాలర్ షిప్లను కూడా అందిస్తోంది. పైగా అక్కడ అధ్యాదునిక మౌలిక సదుపాయాలు, సరైన ప్రణాళికలు, చికిత్సలో సరైన అనుభవం పొందే పద్దతులు ఉంటాయి. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఇరాన్లో పొండిని ఎంబీబీఎస్ పట్టాకు జాతీయ వైద్మ కమిషన్ మంచి గుర్తింపుని ఇస్తుంది. అందుకే ఇరాన్లో చదవడానికి ప్రతిఏటా భారతదేశం నుంచి వేల మంది విద్యార్దులు వెళ్తున్నారు. అయితే అక్కడ ఎమ్బీబీఎస్ పూర్తి చేసిన తర్వాత విద్యార్దులు ఎఫ్ఎంజీఈ పరీక్ష పాసై భారత్లో ప్రాక్టీస్ చేసుకోవచ్చు.
- Iran Israel war latest updates
- Indian medical students in Iran
- Iran missile attacks news today
- Medical education in Iran for Indians
- MBBS in Iran fees details
- NEET competition and MBBS abroad
- Iran medical universities for Indians
- Indian students safety Iran war
- Iran Israel conflict impact on students
- MBBS abroad options for Indians
- Iran scholarship for MBBS students
- NMC approved medical colleges abroad

About

HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire