ఇరాన్‌లో యుద్ధ మేఘాలు: భారతీయులు తక్షణమే దేశం విడిచి రావాలని కేంద్రం రెడ్ అలర్ట్!

ఇరాన్‌లో యుద్ధ మేఘాలు: భారతీయులు తక్షణమే దేశం విడిచి రావాలని కేంద్రం రెడ్ అలర్ట్!
x

ఇరాన్‌లో యుద్ధ మేఘాలు: భారతీయులు తక్షణమే దేశం విడిచి రావాలని కేంద్రం రెడ్ అలర్ట్!

Highlights

Iran-US Tensions: పశ్చిమాసియాలో ముదురుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్‌లోని భారత రాయబార కార్యాలయం (Indian Embassy) అక్కడ నివసిస్తున్న భారత పౌరులకు అత్యవసర హెచ్చరికలు (Advisory) జారీ చేసింది.

Iran-US Tensions: పశ్చిమాసియాలో ముదురుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్‌లోని భారత రాయబార కార్యాలయం (Indian Embassy) అక్కడ నివసిస్తున్న భారత పౌరులకు అత్యవసర హెచ్చరికలు (Advisory) జారీ చేసింది. ఇరాన్-అమెరికా మధ్య యుద్ధం ఎప్పుడైనా మొదలయ్యే అవకాశాలు ఉండటంతో, భారతీయులందరూ తక్షణమే ఆ దేశాన్ని వీడాలని సూచించింది.

ఎంబసీ అడ్వైజరీలోని ముఖ్యాంశాలు:

ఇరాన్‌లో వేగంగా మారుతున్న పరిస్థితుల దృష్ట్యా భారత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

తక్షణ నిష్క్రమణ: విద్యార్థులు, పర్యాటకులు, వ్యాపారవేత్తలు అందుబాటులో ఉన్న కమర్షియల్ విమానాల ద్వారా వెంటనే ఇరాన్ విడిచి వెళ్లాలి.

జాగ్రత్తలు: భారత పౌరులు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. నిరసనలు, ఆందోళనలు జరిగే ప్రాంతాలకు అస్సలు వెళ్లకూడదు.

పత్రాల సిద్ధం: పాస్‌పోర్ట్‌లు, ఐడీ కార్డులు, ఇతర ఇమిగ్రేషన్ పత్రాలను ఎల్లప్పుడూ వెంట ఉంచుకోవాలి.

రిజిస్ట్రేషన్: ఇప్పటివరకు ఎంబసీలో పేరు నమోదు చేసుకోని వారు వెంటనే రిజిస్టర్ చేసుకోవాలని అధికారులు కోరారు.

యుద్ధానికి సన్నద్ధమవుతున్న అమెరికా:

ఇరాన్ అణు చర్చలు విఫలమవడంతో అగ్రరాజ్యం అమెరికా కఠిన వైఖరి అవలంబిస్తోంది. ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్‌పై దాడికి సిద్ధమనే సంకేతాలిచ్చారు. దీనికి బలం చేకూరుస్తూ.. పశ్చిమాసియాలో అమెరికా తన విమాన వాహక నౌకలు, జలాంతర్గాములు మరియు ఫైటర్ జెట్‌లను భారీగా మోహరించింది.

అంతర్గత కల్లోలం:

మరోవైపు ఇరాన్ లోపల కూడా పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి. టెహ్రాన్ సహా పలు నగరాల్లో విద్యార్థులు భారీ ఎత్తున నిరసనలు చేపట్టారు. గతంలో జరిగిన అల్లర్లలో సుమారు 7,105 మంది ప్రాణాలు కోల్పోయారని మానవ హక్కుల సంఘాలు పేర్కొంటున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఇరాన్‌లో ఉన్న వేలాది మంది భారతీయుల భద్రతపై కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories