Korean Beauty Trend: కొరియన్ లుక్ పేషియల్స్ కోసం వేల రూపాయలు ఖర్చుపెడుతున్నారా? ఎందుకు? ఈ సారి మీరు ఇంట్లోనే ఇలా చేసి చూడండి


Korean Beauty Trend: కొరియన్ లుక్ పేషియల్స్ కోసం వేల రూపాయలు ఖర్చుపెడుతున్నారా? ఎందుకు? ఈ సారి మీరు ఇంట్లోనే ఇలా చేసి చూడండి
Korean Beauty Trend: స్కిన్ కేర్ విషయంలో కొరియన్లు తమ స్కిన్ను చాలా అందంగా ఉంచుకుంటారు. ఈ మధ్య కాలంలో కొరియన్ లుక్లో కనిపించాలని యువత తెగ ఆరాటపడుతుంది.
Korean Beauty Trend: స్కిన్ కేర్ విషయంలో కొరియన్లు తమ స్కిన్ను చాలా అందంగా ఉంచుకుంటారు. ఈ మధ్య కాలంలో కొరియన్ లుక్లో కనిపించాలని యువత తెగ ఆరాటపడుతుంది. అందుకే ఇప్పడు ఫ్రూట్, గోల్డ్ ఉన్న ఫేషియల్స్ లిస్ట్ లోకి కొరియన్ ఫేషియల్స్ వచ్చాయి. అయితే వీటి రేటు మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే పార్లల్కు అంత డబ్బు ఖర్చుపెట్టలేను అనుకునేవారు, డబ్బును ఆదా చేయాలుకునేవారు ఇంట్లోనే ఆ ఫేషియల్స్ను ఎలా తయారుచేయాలో తెలుసుకోండి.
కొరియన్ లుక్ అంటే ముఖం షైనీగా, తెల్లగా కనిపిస్తుంది. అంటే ఏదో మంచుగడ్డలో మెరుస్తున్న పాలరాతిలా ముఖం ఉంటుంది. అందుకే కొరియన్ లుక్ని ఇప్పటి యూత్ బాగా ఇష్టపడుతున్నారు. అందుకే మార్కెట్లో ఈ కొరియన్ ఫేషియల్ కిట్, కె బ్యూటీ కిట్లు చాలా వచ్చాయి. అవన్నీ ధర ఎక్కువ. అందులో కెమికల్స్ కూడా ఎక్కువే. దీంతో మీ ముఖంపై మచ్చలు, పింపుల్స్ వచ్చే ప్రమాదం ఉంటుంది. అందుకే ఇంట్లోనే నేచురల్ ఫేస్ ప్యాక్ లు వేసుకుంటే సేమ్ టు సేమ్ అదే లుక్ మీ సొంతం అవుతుంది.
ముందుగా తయారు చేసుకోవలసినవి :
రైస్ వాటర్
కె బ్యూటీ సీక్రెట్.. ఈ రైస్ వాటర్. బియ్యాన్ని సగం ఉడికించి ఆ బియ్యాన్ని వేరు చేస్తే గంజి నీళ్లు మిగులుతాయి. ఈ నీటిని చల్లార్చాక నిల్వ చేసుకుంటే వీటితో ఎన్నో పేషియల్స్ చేసుకోవచ్చు.
రోజ్ వాటర్
కొన్ని గులాబీ రేకులను నీళ్లలో వేసి ఉడికించి, వాటిని వడకట్టి ఈ నీటిని కూడా స్టోర్ చేసుకోవాలి.
మెరిసే చర్మం కోసం..
సాధారంణంగా ముఖాన్ని క్లీన్ చేయాలంటే క్లిన్సింగ్ మిల్క్ వాడుతుంటారు. అలాకాకుండా మీకు కె బ్యూటీ కావాలనుకుంటే ముందుగా నేను చెప్పిన రైస్ వాటర్ని ముఖానికి అప్లై చేసి అరగంట పాటు ఉంచాలి. ఆ తర్వాత గోరు వెచ్చటి నీటిని ముఖంపై వేస్తూ నెమ్మదిగా మసాజ్ చేయాలి. ఇలా తరచూ చేయడం వల్ల ముఖంపై ఉండే మృత కణాలు పోయి చర్మం మెరుస్తుంది.
చర్మం తెల్లగా కావాలంటే..
ఒక గిన్నెలో రైస్ వాటర్, రోజ్ వాటర్, కాఫీ పొడి, శనగ పిండి వేసి కలపాలి. దీన్ని ముఖానికి అప్లై చేసి 20 నిమిషాల పాటు ఉంచాలి. ఆ తర్వాత నెమ్మదిగా మసాజ్ చేస్తూ గోరువెచ్చడి నీటితో కడగాలి. ఇలా వారానికి ఒకసారి చేయడం వల్ల మీ చర్మం తెల్లగా మెరుస్తుంది.
మచ్చలు పోవాలంటే..
ఒక గిన్నెలో బియ్యం పిండి, పెరుగు వేసి బాగా కలపాలి. దీనిలో కావాల్సినంత రోజ్ వాటర్ వేసి కలుపుతూ దాన్ని ముఖానికి అప్లై చేయాలి. అరగంట తర్వాత నీటితో కడిగేయాలి. ఇలా తరచూ చేయడం వల్ల మొటిమలు, మచ్చలు, ముడుతలు తగ్గుతాయి. అయితే వారానికి ఒకసారి చొప్పున ఒక మూడు నెలల పాటు ఇలా చేయడం వల్ల మీకు మంచి ఫలితం కనిపిస్తుంది. ఆ తర్వాత నెమ్మదిగా తగ్గించుకుంటూ వెళ్లాలి.
మొటిమలు ఎక్కువగా ఉంటే..
సహజంగా మొటిమలు ఎక్కువగా ఉన్నవాళ్లకీ ఏ ఫేషియల్ చేయించుకున్నా అవి తగ్గవు. పైగా ఇంకా పెరుగుతు ఉంటాయి. అయితే ఆహారపు అలవాట్లు మార్చుకుంటూ, మధ్య మధ్యలో ఇంట్లోనే కొన్ని బ్యూటీ టిప్స్ పాటిస్తే మొటిమలు తగ్గుతాయి. ఒక గిన్నెలో రైస్ వాటర్, పసుపు, తేనె వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖాన్నికి అప్లై చేయాలి. ఇలా తరచూ చేయడం వల్ల కొత్త మొటిమలు రాకుండా నివారించవచ్చు.
ముఖం షార్ప్ లుక్లో కనిపించాలంటే..
ప్రతిరోజూ రాత్రి పడుకునేముందు ముఖాన్ని ముందుగా నార్మల్ వాటర్తో కడిగి ఆ తర్వాత ఐస్ వాటర్ లో ముఖాన్ని పెట్టి 5 నిమిషాలు ఉండాలి. ఇలా రెండు సార్లు చేయడం వల్ల చర్మం షార్ప్ లుక్ లో కనిపిస్తుంది. వీటన్నింటికంటే ముఖ్యంగా ఎక్కువ నీళ్లు, హెల్దీ ఆహారం తినడం వల్ల కూడా మీ చర్మం షైనీగా తయారవుతుంది.

About

HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire