Naresh: పవిత్ర లోకేష్ కు, నాకు మధ్య ఉన్న సంబంధం అదే..!

Actor Naresh Gives Clarity About Wife Ramya Raghupathi Issue
x

Naresh: పవిత్ర లోకేష్ కు, నాకు మధ్య ఉన్న సంబంధం అదే..! 

Highlights

Naresh: సీనియ‌ర్ న‌టుడు న‌రేశ్‌, ప‌విత్ర లోకేష్ వ్యవహారం రోజుకో మ‌లుపు తిరుగుతోంది.

Naresh: సీనియ‌ర్ న‌టుడు న‌రేశ్‌, ప‌విత్ర లోకేష్ వ్యవహారం రోజుకో మ‌లుపు తిరుగుతోంది. ఒక ర‌కంగా చెప్పాలంటే సినిమా ట్విస్టుల‌ను మించి న‌డుస్తోంది వీరి విష‌యం. మొన్నటి వరకు వీరిద్దరూ పెద్దగా వార్తల్లో లేరు. కానీ మహాబలేశ్వరం వెళ్లినప్పటి నుంచే వీరు పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు వ‌స్తున్నాయి. కానీ తాము పెళ్లి చేసుకోలేద‌ని స‌హ‌జీవ‌న‌మే చేస్తామంటూ ఓపెన్ గానే చెప్పేస్తున్నారు. పుకార్లపై క‌న్నడ మీడియాతో మాట్లాడారు పవిత్ర. పెళ్లి వద్దని స‌హ‌జీవ‌న‌మే ముద్దు అన్నట్టు చెప్పేసింది. ఇక ఆమె మాట‌ల‌పై న‌రేశ్ మూడో భార్య ర‌మ్య ర‌ఘుప‌తి కూడా ప‌లుసార్లు కన్నడ మీడియా ముందుకు వ‌చ్చింది. న‌రేశ్ తో క‌లిసి లేన‌ని, కాక‌పోతే విడాకులు ఇంకా తీసుకోలేద‌ని బాంబు పేల్చింది. ఆయ‌న పెండ్లి చేసుకుంటే త‌న పిల్లల గ‌తేం కాను అని ఆరోపించింది.

ర‌మ్య మీద కూడా న‌రేశ్ ఘాటుగానే స్పందించారు. బెంగుళూరు వెళ్లిన నరేష్ ఓ టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో పవిత్రా లోకేష్ కు తనకు ఉన్న సంబంధం బయటపెట్టారు. గత కొన్నిరోజుల నుంచి తమ మధ్య ఏదో సంబంధం ఉందంటూ వార్తలు వస్తున్నాయన్నారు. వాటిని హైలైట్ చేస్తూ రమ్య మీడియా ముందుకు వచ్చి రచ్చ చేస్తోందని ఆరోపించారు. రమ్య చెప్పేవన్నీ అబద్దాలు మీడియా ముందు తనను తాను గొప్ప చేసుకోవడానికి తనను బ్లేమ్ చేస్తోందని నరేష్ వ్యాఖ్యానించారు. రమ్య ఆగడాల గురించి చెప్పడానికి తనకు నోరు కూడా రావడం లేదన్నారు నరేష్ పవిత్రా లోకేష్ ను టార్గెట్ చేసి తనను సాధించాలని రమ్య చూస్తోందని చెప్పుకొచ్చారు. పవిత్ర తనకు ఐదేళ్లుగా తెలుసన్నారు. హ్యాపీ వెడ్డింగ్ సినిమా షూటింగ్ లో ఆమె పరిచయమైందని వివరించారు. పవిత్ర ఎక్కువ మాట్లాడదన్నారు. చాలా సైలెంట్ పర్సన్ తన మనసులో మాట చెప్పారు. ఎవరితో ఎక్కువగా కలవదనీ తెలిపారు.

ఆ తరువాత సమ్మోహనం సినిమా చేసినప్పుడు తన పరిస్థితి తెలిసి ఫస్ట్ టైమ్ మాట్లాడిందన్నారు. అలా మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ మంచి స్నేహితులమయ్యామని పవిత్రతో తనకున్న సంబంధంపై క్లారిటీ ఇచ్చారు నరేష్. తాను మగాడిని మాత్రమే కాదు మనిషిని తనక్కూడా ప్రేమ కావాలి తనతో ఎవరు మాట్లాడతారో వారితో తనక్కూడా మాట్లాడాలని ఉంటుందన్నారు. సమ్మోహనం సినిమా షూటింగ్‌లో క్లోజ్ అయ్యామని నరేష్ మీడియాకు తెలిపారు. తమ ఇద్దరివీ ఒకేరకమైన అభిరుచులు, ఒకే రకమైన ఆలోచనలంటూ వారి రిలేషన్ గురించి తెలిపారు. తన ఫ్రెండ్, ఫిలాసఫర్, గైడ్ అని చెప్పేందుకు గర్వపడుతున్నాని చెప్పారు. పవిత్ర నా బెస్ట్ ఫ్రెండ్. మా ఇద్దరి మధ్య స్నేహం తప్ప మరేదీ లేదని స్పష్టం చేశారు నరేష్. ఒకే ఫంక్షన్ లో కనిపించాం.. ఒకే గుడికి వెళ్ళాం అంటే.. ఇది 2022.. స్నేహితులు బయటికి వెళ్ళకూడదా..? నరేష్ ప్రశ్నించారు. పవిత్రను అడ్డుపెట్టుకొని రమ్య ఫేమస్ అవ్వాలని చూస్తోందని నరేష్ క్లారిటీ ఇచ్చారు. రమ్య ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదన్న నరేష్‌ 50 లక్షల కోసం ఇంట్లో వాళ్లను పీడించిన చరిత్ర రమ్యదని ఆరోపించారు. రమ్యకు విడాకుల నోటీసు పంపించి నెల అవుతోందని, అందుకే నాకు పెళ్లి కాబోతోందంటూ రూమర్స్‌ క్రియేట్‌ చేస్తోందని అన్నారు. పవిత్ర లోకేష్‌ను లింక్‌ చేసి రూమర్స్‌ క్రియేట్‌ చేయడం చాలా తప్పని అన్నారు నరేష్‌.

ఇలా రమ్య, న‌రేశ్ మ‌ధ్య మాట‌ల యుద్ధం జ‌రుగుతుండ‌గానే ఇప్పుడు ప‌విత్ర మొదటి భర్తగా చెప్పుకుంటున్న సుచేంద్ర ప్రసాద్‌ సీన్ లోకి వ‌చ్చారు. న‌టి పవిత్రపై సీరియ‌స్ కామెంట్లు చేశారు. పవిత్రకు కాపురాలు కూల్చడం అల‌వాటే అంటూ బాంబు పేల్చారు. ఆమెకు డబ్బు పిచ్చి బాగా ఉంద‌ని, అందుకే త‌న‌ను వ‌దిలేసి వెళ్లిందంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.

ఇంకోవైపు ప‌విత్ర కూడా సుచేంద్ర ప్రసాద్‌ కామెంట్లపై స్పందించింది. అస‌లు సుచేంద్రను తాను పెళ్లి చేసుకోలేద‌ని మ‌రో ట్విస్టు ఇచ్చింది. ప్రస్తుతం న‌రేశ్ తోనే క‌లిసి ఉంటున్నాన‌ని, తామిద్దరం గెస్ట్ హౌస్ లో క‌లిసి జీవిస్తున్నట్టు తెలిపింది. న‌రేశ్ కుటుంబ స‌భ్యులు త‌న‌ను ఫ్యామిలీ మెంబ‌ర్ గా గుర్తించారంటూ చెప్పుకొచ్చింది.

ఈ సీన్ ఇలా ఉంటే పవిత్ర లోకేష్ స్వస్థలం మైసూర్‌లో సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా పోలీసులు వెల్లడించారు. ఫేస్‌బుక్‌లో పవిత్ర లోకేష్ పేరుతో ఫేక్ అకౌంట్‌ క్రియేట్ చేసి తన ప్రతిష్ఠకు భంగం కలిగే విధంగా ఆకతాయిలు కొందరు పోస్టులు చేస్తున్నారని ఫిర్యాదు చేశారట. అయితే పవిత్ర లోకేష్ నరేష్ తో కలిసి ఆలయాల్లో పూజలు, ఎక్కడ చూసినా వీరిద్దరు కనిపిస్తుండడంతో వీరి మధ్య ఏదో ఉందని వార్తలు వస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories