OTT: ఓటీటీలోకి మంచు లక్ష్మి ‘దక్ష’! తండ్రీకూతుళ్ల క్రేజీ కాంబో

OTT: ఓటీటీలోకి మంచు లక్ష్మి ‘దక్ష’! తండ్రీకూతుళ్ల క్రేజీ కాంబో
x
Highlights

OTT: మంచు లక్ష్మీ ప్రసన్న ప్రధాన పాత్రలో నటించిన తాజా సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రం ‘దక్ష - ది డెడ్‌లీ కాన్స్పిరసీ’ (Daksha – The Deadly Conspiracy) ఓటీటీలోకి అడుగుపెట్టింది.

OTT: మంచు లక్ష్మీ ప్రసన్న ప్రధాన పాత్రలో నటించిన తాజా సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రం ‘దక్ష - ది డెడ్‌లీ కాన్స్పిరసీ’ (Daksha – The Deadly Conspiracy) ఓటీటీలోకి అడుగుపెట్టింది. థియేటర్లలో ఉత్కంఠభరితమైన కథనంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సినిమా, ఇప్పుడు దీపావళి సందర్భంగా ఇంటిల్లిపాదిని అలరించేందుకు సిద్ధమైంది.

ఏకంగా ప్రైమ్ వీడియోలో..

‘దక్ష’ సినిమా (అక్టోబర్ 17) నుంచే ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో స్ట్రీమింగ్ అవుతోంది. థియేట్రికల్ విడుదలైన (సెప్టెంబర్ 19) నెల రోజుల లోపే ఓటీటీలోకి రావడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.

సినిమా ప్రత్యేకతలు ఇవే!

క్రేజీ కాంబో: ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ.. మంచు మోహన్ బాబు, మంచు లక్ష్మీ తొలిసారిగా ఒకే సినిమాలో తండ్రీకూతుళ్లుగా స్క్రీన్ పంచుకోవడం! మోహన్ బాబు పోషించిన కీలక పాత్ర సినిమాకు మరో హైలైట్‌గా నిలిచింది.

థ్రిల్లింగ్ కథనం: వంశీ కృష్ణ మల్లా కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వ బాధ్యతలు వహించారు. ఈ థ్రిల్లింగ్ కాన్స్పిరసీ డ్రామాను ఆయన అత్యున్నత నిర్మాణ విలువలతో గ్రాండ్‌గా తెరకెక్కించారు.

యు/ఏ సర్టిఫికేట్: సెన్సార్ బోర్డు నుంచి U/A సర్టిఫికేట్ పొందిన ఈ సినిమాలో గూస్‌బంప్స్ తెప్పించే ఉత్కంఠభరిత ఎపిసోడ్స్ ప్రేక్షకులను కట్టిపడేశాయి.

నటీనటులు: మంచు లక్ష్మితో పాటు, సీనియర్ నటులు సముద్ర ఖని, సిద్ధిక్ వంటి వారు కీలక పాత్రల్లో నటించారు.

మంచు ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై రూపొందిన ఈ సైకలాజికల్ థ్రిల్లర్‌ను థియేటర్లలో చూడలేని వారు, ఇప్పుడు ప్రైమ్ వీడియోలో చూసి ఎంజాయ్ చేయవచ్చు!

Show Full Article
Print Article
Next Story
More Stories