Jr NTR: హై కోర్టు‌ను ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్..

Jr NTR Approach High Court in Land Issue
x

Jr NTR: హై కోర్టు‌ను ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్..

Highlights

Jr NTR: ఒక ల్యాండ్ కు సంబంధించిన వివాదంలో హైకోర్టును ఆశ్రయించారు జూనియర్ ఎన్టీఆర్. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 75 లో ఉన్న ప్లాట్ విషయంలో వివాదం నెలకొంది.

Jr NTR: ఒక ల్యాండ్ కు సంబంధించిన వివాదంలో హైకోర్టును ఆశ్రయించారు జూనియర్ ఎన్టీఆర్. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 75 లో ఉన్న ప్లాట్ విషయంలో వివాదం నెలకొంది. 2003లో గీత లక్ష్మీ అనే మహిళ నుంచి ప్లాట్ కొనుగోలు చేశారు తారక్. గీతలక్ష్మి 1996 నుండి పలు బ్యాంకుల వద్ద ఇదే స్థలాన్ని తాకట్టు పెట్టి గీతలక్ష్మి కుటుంబం రుణాలు తీసుకుంది. ఈ విషయాన్ని దాచిపెట్టి జూనియర్ ఎన్టీఆర్ కు ప్లాట్ ను విక్రయించారు.

అయితే జూనియర్ ఎన్టీఆర్ కు ఈ ప్రాపర్టీ అమ్మే సమయంలో విషయాన్ని గీత లక్ష్మి దాచిపెట్టింది. ఐదు బ్యాంకుల నుండి ఇదే డాక్యుమెంట్ మీద లోన్స్ తీసుకుంది గీత లక్ష్మి. కేవలం ఒక్క బ్యాంకులో మాత్రమే మార్ట్ గేజ్ లోన్ ఉన్నట్లు ఎన్టీఆర్ కు చెప్పింది గీత లక్ష్మీ. చెన్నై లో ఒక బ్యాంక్ లో లోన్ క్లియర్ చేసి డాక్యుమెంట్ తీసుకున్నారు తారక్. 2003 నుండి ఈ స్థలానికి ఓనర్ గా తారక్ ఉన్నారు. అప్పటినుండి పలు బ్యాంకు మేనేజర్లతో వివాదం కొనసాగుతుంది.

ప్రాపర్టీ ను స్వాధీనం చేసుకునేందుకు బ్యాంక్ మేనేజర్లు ప్రయత్నం చేస్తున్నారు. దాంతో ఆ బ్యాంకు మేనేజర్లపై పోలీసులకు ఫిర్యాదు చేశారు జూనియర్ ఎన్టీఆర్. 2019 లో ఇదే వ్యవహారంలో పోలీసులు ఛార్జి షీట్ దాఖలు చేశారు. అయితే DRT లో జూనియర్ ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా ఆర్డర్ వచ్చింది. దీంతో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు జూనియర్ ఎన్టీఆర్. జూన్ 3 లోపు DRT డాకెట్ ఆర్డర్ సబ్మిట్ చేయమని హై కోర్టు ఆదేశించింది. జూన్ 6న విచారణ చేపడతామని హైకోర్టు తెలిపింది.

Show Full Article
Print Article
Next Story
More Stories