SS Rajamouli: ఈసారి అంతకుమించి.. మహేష్‌ సినిమా కోసం జక్కన్న పెద్ద స్కెచ్‌

SS Rajamouli: ఈసారి అంతకుమించి.. మహేష్‌ సినిమా కోసం జక్కన్న పెద్ద స్కెచ్‌
x
Highlights

SS Rajamouli, Mahesh Babu Movie Latest Updates: ఇంతవరకు అపజయం ఎరుగని దర్శకుల్లో రాజమౌళి మొదటి వరుసలో ఉంటారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటి వరకు...

SS Rajamouli, Mahesh Babu Movie Latest Updates: ఇంతవరకు అపజయం ఎరుగని దర్శకుల్లో రాజమౌళి మొదటి వరుసలో ఉంటారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటి వరకు తీసిన ప్రతీ ఒక్క సినిమా బాక్సాఫీస్‌ వద్ద సంచలన విజయాలు నమోదు చేసుకున్నాయి. ఇక ఆర్ఆర్ఆర్ తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తోన్న చిత్రంపై ఇప్పటి నుంచే అంచనాలు ఓ రేంజ్‌లో పెరిగిపోయాయి.

ఈసారి రాజమౌళి మహేష్‌ బాబుతో సినిమాను తెరకెక్కించనున్న విషయం తెలిసిందే. ఎస్‌ఎస్‌ఎంబీ 29 అనే వర్కింగ్‌ టైటిల్‌తో ఈ సినిమా రానుంది. బాహుబలి, ట్రిపులార్‌తో ప్రపంచవ్యాప్తంగా సినిమా ప్రేక్షకులను ఆకట్టుకున్న జక్కన్న ఈసారి అంతకుమించిన కథతో ప్రేక్షకులను మెస్మరైజ్‌ చేసేందుకు వస్తున్నారు. అంచనాలకు అనుగుణంగా ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రపంచ స్థాయి చిత్రంగా తెరకెక్కించనున్నారు రాజమౌళి.

దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కేఎల్‌ నారాయణ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను భారత్‌తో పాటు ఇతర దేశాల్లోనూ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ చిత్రానికి సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతోంది. సాధారణంగా రాజమౌళి సినిమాలు అంటేనే విజువల్‌ ఎఫెక్ట్స్‌ ఓ రేంజ్‌లో ఉంటాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఈసారి జక్కన్న అంతకు మించి ప్లాన్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఇందుకోసం ప్రత్యేక తరగతులకు హాజరవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. సినిమాలోని కొన్ని పాత్రలను సృష్టించేందుకు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఉపయోగిస్తున్నారని సమాచారం. కొన్ని పాత్రలను, జంతువులను సృష్టించేందుకు ఈ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఇప్పటి వరకు వీఎఫ్‌ఎక్స్‌తో మాయ చేసిన జక్కన్న ఇప్పుడు ఏఐతో వండర్‌ చేయనున్నారని వార్తలు వస్తున్నాయి. ఇక ఈ సినిమా కథ అమెజాన్‌ అడవుల నేపథ్యంలో సాగనుందని వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రాన్ని 2027లో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories