
Jana Nayagan : కరూర్ విషాదం ఎఫెక్ట్ లేదు..జన నాయగన్ రిలీజ్పై క్లారిటీ..ఆ రోజు రావడం పక్కా
Jana Nayagan : తమిళ సూపర్ స్టార్, దళపతి విజయ్ రాజకీయాల్లోకి అడుగుపెడుతున్న నేపథ్యంలో ఆయన చివరి సినిమా జన నాయగన్ పై అంచనాలు భారీగా ఉన్నాయి
Jana Nayagan : తమిళ సూపర్ స్టార్, దళపతి విజయ్ రాజకీయాల్లోకి అడుగుపెడుతున్న నేపథ్యంలో ఆయన చివరి సినిమా జన నాయగన్ పై అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే, ఇటీవల కరూర్ లో జరిగిన విజయ్ ఎన్నికల ర్యాలీలో 41 మంది మరణించి, 100 మందికి పైగా గాయపడటం ఆయనకు పెద్ద ఎదురుదెబ్బగా మారింది. ఈ విషాదకర ఘటన కారణంగా సినిమా విడుదల వాయిదా పడుతుందని ఊహాగానాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో జన నాయగన్ టీమ్ ఆ ఊహాగానాలకు తెరదించుతూ, సినిమా నిర్ణీత తేదీకే (జనవరి 9) విడుదలవుతుందని తాజాగా స్పష్టం చేసింది.
దళపతి విజయ్ ఇటీవలే కరూర్ నగరంలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో భారీ విషాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 41 మంది మరణించగా, 100 మందికి పైగా అభిమానులు గాయపడ్డారు. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల్లో తన పార్టీ తరఫున పోటీ చేయనున్నట్లు విజయ్ ఇప్పటికే ప్రకటించారు. అయితే, కరూర్ ర్యాలీలో జరిగిన ఈ దురదృష్టకర సంఘటన రాజకీయ రంగంలోకి అడుగుపెడుతున్న విజయ్కి పెద్ద ప్రతికూల అంశంగా మారింది.
ఈ ఘటన కారణంగా విజయ్ చివరి చిత్రం జన నాయగన్ విడుదల వాయిదా పడవచ్చు అనే ఊహాగానాలు మొదలయ్యాయి. వాయిదా ఊహాగానాలకు ఫుల్స్టాప్ పెడుతూ, జన నాయగన్ సినిమా బృందం విడుదల తేదీపై క్లారిటీ ఇచ్చింది. సినిమా బృందం విడుదల చేసిన కొత్త పోస్టర్లో జనవరి 9న సినిమా థియేటర్లలోకి వస్తున్నట్లు స్పష్టంగా పేర్కొన్నారు. ఈ సినిమా ముందుగా అనుకున్న తేదీకే విడుదలవుతుందని మేకర్స్ ధృవీకరించారు. విడుదలైన పోస్టర్లో విజయ్ జన సమూహం మధ్యలో నిలబడి ఉండగా, అభిమానులు ఆయనను తాకుతున్నట్టుగా చూపించారు. సినిమా రాజకీయ కథాంశాన్ని కలిగి ఉంటుందని వస్తున్న వార్తలకు ఈ పోస్టర్ బలాన్ని చేకూర్చింది.
జన నాయగన్ చిత్రంపై విజయ్ అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా విజయ్ చివరి సినిమా కావడం, ఆ తర్వాత ఆయన పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వెళ్లనుండటంతో ఈ అంచనాలు మరింత పెరిగాయి. ఈ చిత్రాన్ని దర్శకుడు హెచ్. వినోద్ రూపొందిస్తున్నారు. వినోద్ ఇంతకు ముందు అజిత్ కుమార్తో వరుసగా మూడు విజయవంతమైన సినిమాలు అందించడం విశేషం. ఈ సినిమాను కన్నడ చిత్రసీమలో విజయవంతమైన నిర్మాణ సంస్థ అయిన కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తూ, తమిళ చిత్రసీమలోకి అడుగుపెడుతోంది. ఈ చిత్రంలో మలయాళ నటి మమితా బైజు కీలక పాత్రలో నటించారు. థియేటర్లలో విడుదలైన తర్వాత, ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో OTT ప్లాట్ఫామ్లో ప్రసారం కానుంది.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




