PM Kisan Yojana: రైతులకు బిగ్ అలర్ట్..పీఎం కిసాన్ రూ. 2వేలు డబ్బు జమ అయ్యేది అప్పుడే..!!


PM Kisan Yojana: రైతులకు బిగ్ అలర్ట్..పీఎం కిసాన్ రూ. 2వేలు డబ్బు జమ అయ్యేది అప్పుడే..!!
PM Kisan Yojana: పీఎం కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ 20వ విడత కోసం ఎదురు చూస్తున్న రైతులకు బిగ్ అలర్ట్.
PM Kisan Yojana: పీఎం కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ 20వ విడత కోసం ఎదురు చూస్తున్న రైతులకు బిగ్ అలర్ట్. అతి త్వరలోనే రైతుల ఖాతాల్లోకి డబ్బు డిపాజిట్ కానుంది. అయితే ప్రభుత్వం కచ్చితమైన తేదీని మాత్రం ఇంకా ప్రకటించలేదు. ఇప్పటి వరకు 19 విడతలుగా రైతులకు ఫండ్స్ క్రెడిట్ చేసింది. 2025 ఫిబ్రవరి 24న రైతుల ఖాతాల్లోకి 19వ విడత డబ్బులు జమ అయ్యాయి. 9.8కోట్ల మందికి పైగా లబ్దిదారులకు రూ. 22,000కోట్లు కేటాయించారు. తర్వాతి విడత డబ్బులు రావడానికి రైతులు కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది అవేంటో చూద్దాం.
పీఎం కిసాన్ స్కీమ్ కింద అర్హత ఉన్న రైతులకు ఏడాదికి రూ. 6వేలు ఇస్తారు. ప్రతి నాలుగు నెలలకు రూ. 2వేల చొప్పున మూడు విడతలుగా రైతుల బ్యాంకు అకౌంట్లోకి డబ్బులు డిపాజిట్ అవుతాయి. ఈ మొత్తాన్ని డిబిటి ద్వారా నేరుగా రైతులకు క్రెడిట్ చేస్తారు. వ్యవసాయం, ఇంటి ఖర్చులు తీర్చుకునేందుకు ఈ మొత్తం ఉపయోగపడుతుంది.
అయితే 20వ వాయిదా ఎప్పుడు వస్తుందనేది మాత్రం అధికారిక తేదీ ప్రకటించినప్పటికీ 20వ పీఎం కిసాన్ నిధులు విడత జూన్ 20 నాటికి విడుదల కావచ్చని నివేదికలు చెబుతున్నాయి. స్కీమ్ నాలుగు నెలల షెడ్యూల్ ప్రకారం ఈ నెలలో డబ్బు అందించాలి. ఇంతకు ముందు విడతను 2025 ఫిబ్రవరి 24న బీహార్ లోని భాగల్పూర్ నుంచి ప్రధాని మోదీ విడుదల చేశారు. అకౌంట్లో డబ్బు జమ కావాలంటే రైతులు కొన్ని రిక్వైర్ మెంట్స్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అవి చేయనట్లయితే పేమెంట్ మరింత ఆలస్యం కావచ్చు లేదంటే రిజక్ట్ కావచ్చు. కొంతమంది రైతులకు డబ్బు అందకపోవడానికి కారణలేంటో చూద్దాం.
రైతులు తమ గుర్తింపును ధ్రువీకరించేందుకు ఈకేవైసీ ప్రాసెస్ పూర్తి చేయాలి. ఇది లేకుంటే డబ్బు డిపాజిట్ అవ్వదు. మీరు www.pmkisan.gov.inలో ఆన్ లైన్ లో లేదా సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ లో ఈ కేవైసీ పూర్తి చేసుకోవచ్చు. రైతు బ్యాంక్ అకౌంట్ వారి ఆధార్ నెంబర్ ను కచ్చితంగా లింక్ చేయాలి. ఆధార్ నెంబర్ తప్పుగా ఉంటే లేదా లింక్ చేయకపోతే డబ్బు జమ కాదు. రైతులు భూమి వివరాలను వెరిఫై చేసుకోవాలి. ఈ ప్రాసెస్ పెండింగ్ లో ఉంటే డబ్బు వారి అందదు. ఈ దశను పూర్తి చేయడానికి స్థానిక రెవెన్యూ ఆఫీస్ లేదా సీఎస్సీని విజిట్ చేయాలి.
పీఎం కిసాన్ స్కీమ్ కింద నమోదు చేసుకోవాలి. వ్యాలిడ్ ఐడీ ఉండాలి. రిజిస్ట్రేషన్ లేకుండా పేమెంట్ అర్హులు కారు. మీ రిజిస్ట్రేషన్ స్టేటస్ ను చెక్ చేసేందుకు లేదా సైన్ అప్ చేసేందుకు పీఎం కిసాన్ పోర్టల్ చెక్ చేయాలి.

About

HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire